యాప్నగరం

యూఎన్‌వోలో భారత్‌కు అరుదైన అవకాశం

ఐక్యరాజ్య సమితిలో భారత్‌కు అరుదైన అవకాశం దక్కింది. యూఎన్‌వో మానవ హక్కుల కౌన్సిల్‌కు జరిగిన ఎన్నికల్లో సత్తా చాటింది.

Samayam Telugu 12 Oct 2018, 10:26 pm
క్యరాజ్య సమితి (యూఎన్‌వో) లో భారత్‌కు అరుదైన అవకాశం లభించింది. యూఎన్‌వో మానవ హక్కుల సంస్థ (హ్యూమన్ రైట్స్ కౌన్సిల్)కు ప్రతినిధిగా భారత్ ఎంపికైంది. యూఎన్‌వో తరఫున మూడేళ్ల పాటు భారత్ ఈ సేవలు అందిస్తుంది. తద్వారా ప్రపంచ దేశాలపై మరింత ప్రభావవంతంగా పనిచేసే వెలుసుబాటు కలుగుతుంది. ఆసియా-పసిఫిక్ కేటగిరీలో 188 ఓట్లతో ఈ పదవి దక్కించుకుంది. 2019 జనవరి 1 నుంచి భారత్ ఈ పాత్ర పోషించనుంది.
Samayam Telugu India


193 సభ్యులున్న యూఎన్ జనరల్ అసెంబ్లీలో హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ సభ్యుల స్థానానికి ఎన్నికలు నిర్వహించారు. సీక్రెట్ బ్యాలెట్ పద్ధతి ద్వారా 18 స్థానాలకు కొత్త అభ్యర్థులను ఎన్నుకున్నారు. కౌన్సిల్‌కు ఎంపికవడానికి ఒక్కో స్థానానికి 97 ఓట్లు కావాల్సి ఉండగా.. భారత్‌ 188 ఓట్లతో ఘన విజయం దక్కించుకుంది.

ఆసియా-పసిఫిక్ విభాగంలో ఇండియా ఈ స్థానానికి పోటీ పడింది. ఈ కేటగిరీ నుంచి భారత్‌తో పాటు బహ్రెయిన్, బంగ్లాదేశ్, ఫిజీ, ఫిలిఫ్పై్న్స్ ఈ స్థానం కోసం పోటీపడ్డాయి. అయితే.. వీటిలో ఒక్కో దేశానికి ఒక్కో అవకాశం దక్కడం విశేషం. హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ స్థానానికి ఈ ఐదు దేశాలూ పోటీపడినప్పటికీ.. భారత్ విజయం తేలికే అయింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.