యాప్నగరం

ఈసారి గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథి ఎవరంటే..

UK Prime Minister Boris Johnson: 2021 గణతంత్ర దినోత్సం వేడుకలకు విశిష్ట అతిథిగా బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి. వేడుకలకు రావాల్సిందిగా బోరిస్ జాన్సన్‌ను ప్రధాని మోదీ ఆహ్వానించారు.

Samayam Telugu 2 Dec 2020, 8:30 pm
సారి గణతంత్ర వేడుకలకు విశిష్ట అతిథిగా బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ (Boris Johnson) హాజరు కానున్నారు. కేంద్ర ప్రభుత్వం ఆయనకు ఆహ్వానం పంపింది. ప్రధాని మోదీ నవంబర్ 27న బోరిస్ జాన్సన్‌తో ఫోన్‌లో సంభాషించారు. 2021 భారత గణతంత్ర వేడుకలకు (Republic Day 2021) హాజరు కావాలని ఈ సందర్భంగా ఆయణ్ని ఆహ్వానించారు. అయితే.. వేడుకలకు బోరిస్ జాన్సన్ హాజరయ్యే అంశంపై బ్రిటన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకొని భారత్‌కు సమాచారం ఇవ్వాల్సి ఉంది.
Samayam Telugu ఎర్ర కోట
Republic Day 2021 chief guest UK PM


బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్.. ప్రధాని మోదీని జీ-7 దేశాల సదస్సుకు రావాల్సిందిగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ఆయణ్ని రిపబ్లిక్ వేడుకలకు రావాల్సిందిగా ఆహ్వానించారు. గణతంత్ర వేడుకలకు బ్రిటన్ ప్రధాని‌ని ఆహ్వానించడం మంచి పరిణామమని విశ్లేషకులు చెబుతున్నారు. భారత్-బ్రిటన్ మధ్య సంబంధాల బలోపేతానికి ఇది దోహదం చేస్తుందని చెబుతున్నారు. మోదీ, జాన్సన్ ఫోన్ సంభాషణ సందర్భంగానూ ఇరుదేశాల సంబంధాల బలోపేతంపై కీలకంగా చర్చించారు.

చివరిసారిగా 1993లో బ్రిటన్ ప్రధాని భారత రిపబ్లిక్ వేడుకలకు హాజరయ్యారు. నాటి యూకే ప్రధాని జాన్ మేజర్ ఈ వేడుకల కోసం న్యూఢిల్లీ విచ్చేశారు.

Also Read: మరణానికి ముందు అమర జవాన్ మాటలు.. కంటతడి పెట్టిస్తున్నాయి!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.