యాప్నగరం

‘ఆలస్యం వల్ల రూ.12లక్షల కోట్లు నష్టపోయాం’

యూపీఏ అధికారంలో ఉన్నప్పుడు జీఎస్టీ బిల్లును అప్పటి ప్రధానప్రతిపక్షమైన బీజేపీ తీవ్రంగా వ్యతిరేకించిందని కాంగ్రెస్ నేత వీరప్ప మొయిలీ

TNN 29 Mar 2017, 6:15 pm
యూపీఏ అధికారంలో ఉన్నప్పుడు జీఎస్టీ బిల్లును అప్పటి ప్రధానప్రతిపక్షమైన బీజేపీ తీవ్రంగా వ్యతిరేకించిందని కాంగ్రెస్ నేత వీరప్ప మొయిలీ విమర్శించారు. బీజేపీ వల్ల జీఎస్టీ బిల్లు ఆలస్యమైందని, దాని వల్ల భారత్ రూ.12లక్షల కోట్లు నష్టపోయిందని ఆయన ఆరోపించారు. బుధవారం లోక్ సభలో ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ జీఎస్టీ,దాని అనుబంధ బిల్లులను ప్రవేశపెట్టారు. జీఎస్టీబిల్లుపై జరిగిన చర్చలో కాంగ్రెస్ సభ్యుడు వీరప్ప మొయిలీ బీజేపీ ప్రభుత్వంపై పలు విమర్శలు చేశారు.
Samayam Telugu india lost rs 12 lakh crore due to bjps opposition to gst veerappa moily
‘ఆలస్యం వల్ల రూ.12లక్షల కోట్లు నష్టపోయాం’


‘‘జీఎస్టీ బిల్లును ప్రభుత్వం విప్లవాత్మకమైందని చెబుతోంది కానీ..ఇది మార్పు తెచ్చేదాని కన్నా.. శిశువు అడుగులాంటిదే. ఇదో సాంకేతిక పీడకలగా మారే ప్రమాదముంది. యూపీఏ హయంలో ఏడెనిమిదేళ్ల క్రితమే జీఎస్టీ బిల్లు తెచ్చే ప్రయత్నం జరిగింది. కానీ కొన్ని పార్టీలు ఉద్దేశ్యపూర్వకంగా అడ్డుకున్నాయి’’ అని మొయిలీ బీజేపీ టార్గెట్ గా విమర్శలు గుప్పించారు.

జీఎస్టీకి చట్టబద్ధత కల్పించడంలో జాప్యం జరిగినందుకు యేటా రూ.1.5లక్షల కోట్లు నష్టపోయామని..ఇప్పటి వరకు రూ.12లక్షల కోట్లు నష్టపోయామని తెలిపారు. ఇంత మొత్తంలో నష్టాన్ని ఎవరు పూడ్చుతారని ఆయన ప్రశ్నించారు.

ప్రతిపాదిత జీఎస్టీ బిల్లులో అధిక పన్నులున్నాయని, దీని వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయని మొయిలీ అన్నారు. ‘‘ఒకే దేశం ఒకే పన్ను విధానమే మిథ్య’’ అని విమర్శించారు. బ్లాక్ మనీ బాగా బయటపడే రియల్ ఎస్టేట్ సెక్టార్ ను జీఎస్టీ బిల్లులో చేర్చకపోవడం దారుణమని అన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.