యాప్నగరం

కరోనాతో 24 మంది మృతి.. దేశంలో కొత్త కేసుల వివరాలు..

Monkeypox: భారత్‌లో కొత్తగా 16,464 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా మరో 24 మంది మరణించారు. తాజా కేసులతో దేశంలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 1,43,989కు చేరింది. కొవిడ్ కారణంగా దేశంలో ఇప్పటివరకు 5,26,396 మంది మరణించారు. మరోవైపు.. మంకీపాక్స్ వైరస్‌తో ఓ వ్యక్తి మృతి చెందిన తొలి కేసు నమోదవడం దేశంలో అలజడి రేపుతోంది. కేరళలో మంకీపాక్స్ వైరస్ బారిన పడి వ్యక్తి మృతి చెందాడు.

Authored byశ్రీనివాస్ గంగం | Samayam Telugu 1 Aug 2022, 12:03 pm
దేశంలో కొత్తగా 16,464 కరోనా కేసులు నమోదయ్యాయి. కొవిడ్‌ బారినపడి 24 మంది మృత్యువాతపడ్డారు. తాజా కేసులతో దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 1,43,989కు చేరింది. కొవిడ్ కారణంగా భారత్‌లో మరణించిన వారి సంఖ్య 5,26,396కు ఎగబాకింది. దేశంలో ఇప్పటివరకు 4,40,36,275 మంది కరోనా బారినపడ్డారు. కొత్త కేసుల కంటే కోలుకునే వారి సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ఆదివారం నాటి కేసుల కంటే మూడు వేల కేసులు తగ్గాయని వెల్లడించింది.
Samayam Telugu Representational Image
ప్రతీకాత్మక చిత్రం


గడిచిన 24 గంటల వ్యవధిలో 16,112 మంది కొవిడ్ నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ఆదివారం 8.34 లక్షల డోసుల కొవిడ్ వ్యాక్సిన్ పంపిణీ చేసినట్లు వెల్లడించింది.

మరోవైపు.. దేశంలో మంకీపాక్స్ వైరస్‌తో మృతి చెందిన తొలి కేసు నమోదవడం అలజడి రేపుతోంది. కేరళలో మంకీపాక్స్ వైరస్ బారిన పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఇప్పటికే ఈ వైరస్ ప్రపంచాన్ని ఆందోళనకు గురి చేస్తోంది.
రచయిత గురించి
శ్రీనివాస్ గంగం
శ్రీనివాస్ రెడ్డి గంగం సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ అంశాలపై వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. EJS నుంచి శిక్షణ పొందిన శ్రీనివాస్‌కు జర్నలిజంలో 12 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. JNTU నుంచి BTech చేశారు. గతంలో ప్రముఖ పత్రికల్లో వార్తలు, విద్యా సంబంధిత అంశాలు అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.