యాప్నగరం

ప్రబల శక్తిగా భారత్.. ప్రాబల్యం కోల్పోతున్న అమెరికా, చైనా: ఆర్థికవేత్త జిమ్ ఓనిల్

Jim O'Neill: కరోనా సంక్షోభం వేళ అమెరికా తన ఆధిపత్యాన్ని కోల్పోతోందని.. చైనా పాత్ర బలహీనపడుతోందని ప్రముఖ ఆర్థికవేత్త జిమ్ ఓనిల్ చెప్పారు. భవిష్యత్తులో భారత్ ప్రబల శక్తిగా ఎదిగే అవకాశం ఉందని చెప్పారు.

Samayam Telugu 15 Jun 2020, 10:08 pm
ప్రపంచంలో భారత్‌ ప్రబల శక్తిగా అవతరించడానికి అవకాశాలు మెండుగా ఉన్నాయని ప్రముఖ ఆర్థికవేత్త, గోల్డ్‌మన్‌ శాక్స్‌ మాజీ చీఫ్‌ ఎకనమిస్ట్‌ జిమ్‌ ఓనిల్‌ పేర్కొన్నారు. భారత ప్రభుత్వం దూకుడుగా సంస్కరణలు అమలు చేస్తే తిరుగులేని శక్తిగా మారుతుందని తెలిపారు. కరోనా మహమ్మారి కారణంగా ప్రస్తుతం సంక్షోభం నెలకొన్న నేపథ్యంలో అమెరికా తన అంతర్జాతీయ ఆధిపత్యాన్ని కోల్పోతోందని.. అటు చైనా పాత్ర బలహీనపడుతోందని ఆయన వివరించారు. ఈ రెండు దేశాల స్థానాన్ని రానున్న రెండు దశాబ్దాల్లో భారత్‌ ఆక్రమిస్తుందని ఆయన జోస్యం చెప్పారు.
Samayam Telugu జిమ్ ఓనిల్
JIm


టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూపునకు చెందిన ‘ET Now’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఆసక్తికర వివరాలు తెలిపారు. జనాభా, ఆర్థిక వ్యవస్థ పరిమాణం లాంటి అంశాల ప్రాతిపదికన భారత్‌కు మరే దేశం పోటీ కాదని ఆయన స్పష్టం చేశారు. కరోనా వైరస్‌తో నెలకొన్న సంక్షోభాన్ని భారత్‌ అవకాశంగా మలుచుకోవాలని సూచించారు.

ఆరోగ్య సంరక్షణ, గృహ నిర్మాణం, విద్యా రంగాల్లో సంస్కరణలను వేగవంతం చేయాలని జిమ్‌ ఓలిన్ సూచించారు. మౌలిక వసతులను మెరుగుపరుచుకోవాలని సూచించారు. సేవా రంగంలో భారత్‌ సరఫరా వ్యవస్థ (సప్లై చైన్‌) ప్రభావవంతమైందని.. ప్రస్తుత సంక్షోభంతో గ్లోబల్‌ సప్లయి చైన్‌లో చైనా పాత్ర బలహీనమైందని వివరించారు. భారత్‌ ఈ అవకాశాలను అందిపుచ్చుకోవాలని సూచించారు.

Watch: జిమ్ ఓనిల్ పూర్తి ఇంటర్వ్యూ..

Also Read: భార్యాభర్తల బంధం పెంచుతున్న వర్క్ ఫ్రం హోం.. సర్వేలో ఆసక్తికర వివరాలు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.