మరికొన్ని సంవత్సరాల్లో భారతదేశం జనాభా చైనాను మించిపోతుందని ఐక్యరాజ్య సమితి (UNO) అంచనా వేసింది. 2024 నాటికి చైనా జనాభాను భారత్ మించిపోతుందని వెల్లడించింది. 2030 నాటికి భారత జనాభా 150 కోట్లకు చేరుతుందని పేర్కొంది. ‘ప్రపంచ జనాభా భావి అంచనాలు: 2017 సవరణ’ పేరుతో ఐక్యరాజ్యసమితికి చెందిన ఆర్థిక, సామాజిక వ్యవహారాల విభాగం నివేదికను వెలువరించింది. వాస్తవానికి 2022 నాటికే చైనా జనాభాను భారత్ మించిపోతుందని గతంలో ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది. ఇప్పుడు తాజాగా 2024గా సవరించింది.
భారత ప్రస్తుత జనాభా 134 కోట్లు కాగా.. చైనా జనాభా 141 కోట్లుగా ఉంది. మొత్తం ప్రపంచ జనాభాలో చైనా 19 శాతం ఆక్రమించగా.. భారత జనాభా 18 శాతంగా ఉంది. 2024 నాటికి ఈ రెండు దేశాలు దాదాపు 144 కోట్ల చొప్పున జనాభా కలిగి ఉంటాయి ఐక్యరాజ్యసమితి నివేదికలో పేర్కొంది. ఈ నివేదిక ప్రకారం.. భారత్ జనాభా 2030 నాటికి దాదాపు 150 కోట్లకు చేరుతుంది. ఈ సంఖ్య 2050 నాటికి 166 కోట్లకు పెరుగుతుంది. అయితే 2050 నుంచి 2100 మధ్య కాలంలో భారత్ జనాభా 151 కోట్లకు తగ్గొచ్చని నివేదిక వెల్లడించింది. అయినప్పటికీ ప్రపంచంలో అత్యంత జనాభా గల దేశంగా భారత్ ఉంటుందని పేర్కొంది.
ప్రస్తుతం ప్రపంచ జనాభా 760 కోట్లు కాగా.. 2030 నాటికి 860 కోట్లకు చేరుతుంది. ఇక 2050 నాటికి 980 కోట్లు, 2100 నాటికి 1120 కోట్లకు ప్రపంచ జనాభా పెరుగుతుంది. భారత్లో మనుషుల జీవిత కాలం గురించి కూడా ఐక్యరాజ్య సమితి తన నివేదికలో వెల్లడించింది. 2025 - 30 కాలంలో భారత్లో వ్యక్తి సగటు జీవిత కాలం 71 ఏళ్లుగా ఉంటుందని పేర్కొంది. అయితే ఇది 2045-50కి 74.2 ఏళ్లకు పెరుగుతుందని చెప్పింది.
భారత ప్రస్తుత జనాభా 134 కోట్లు కాగా.. చైనా జనాభా 141 కోట్లుగా ఉంది. మొత్తం ప్రపంచ జనాభాలో చైనా 19 శాతం ఆక్రమించగా.. భారత జనాభా 18 శాతంగా ఉంది. 2024 నాటికి ఈ రెండు దేశాలు దాదాపు 144 కోట్ల చొప్పున జనాభా కలిగి ఉంటాయి ఐక్యరాజ్యసమితి నివేదికలో పేర్కొంది. ఈ నివేదిక ప్రకారం.. భారత్ జనాభా 2030 నాటికి దాదాపు 150 కోట్లకు చేరుతుంది. ఈ సంఖ్య 2050 నాటికి 166 కోట్లకు పెరుగుతుంది. అయితే 2050 నుంచి 2100 మధ్య కాలంలో భారత్ జనాభా 151 కోట్లకు తగ్గొచ్చని నివేదిక వెల్లడించింది. అయినప్పటికీ ప్రపంచంలో అత్యంత జనాభా గల దేశంగా భారత్ ఉంటుందని పేర్కొంది.
ప్రస్తుతం ప్రపంచ జనాభా 760 కోట్లు కాగా.. 2030 నాటికి 860 కోట్లకు చేరుతుంది. ఇక 2050 నాటికి 980 కోట్లు, 2100 నాటికి 1120 కోట్లకు ప్రపంచ జనాభా పెరుగుతుంది. భారత్లో మనుషుల జీవిత కాలం గురించి కూడా ఐక్యరాజ్య సమితి తన నివేదికలో వెల్లడించింది. 2025 - 30 కాలంలో భారత్లో వ్యక్తి సగటు జీవిత కాలం 71 ఏళ్లుగా ఉంటుందని పేర్కొంది. అయితే ఇది 2045-50కి 74.2 ఏళ్లకు పెరుగుతుందని చెప్పింది.