యాప్నగరం

భారత ఆర్మీ చీఫ్ నరవణేను స‌త్కరించ‌నున్న నేపాల్

Nepal: ఆర్మీ చీఫ్ ఎంఎం నరవణే నవంబర్ నెలలో నేపాల్ సందర్శించనున్నారు. ఖాట్మండులో ఆయణ్ని నేపాల్ దేశ గౌరవ జనరల్ ర్యాంక్‌తో సత్కరించనున్నారు. మ్యాప్ వివాదంలో నేపథ్యంలో నరవణే నేపాల్ సందర్శన హాట్ టాపిక్‌గా మారింది.

Samayam Telugu 15 Oct 2020, 3:17 pm
ఇండియన్ ఆర్మీ చీఫ్ జ‌న‌ర‌ల్ ఎం.ఎం. న‌ర‌వణే వ‌చ్చే నెల‌లో నేపాల్ సందర్శించనున్నారు. భారత్‌లోని భూభాగాలను తమ దేశంలో చూపిస్తూ నేపాల్ వివాదాస్పద మ్యాప్‌ను విడుదల చేసిన తర్వాత ఇరు దేశాల మధ్య సంబంధాలు క్షీణించిన నేపథ్యంలో నరవణే పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. అంతేకాదు, ఖాట్మండులో జరిగే కార్యక్రమంలో న‌ర‌వణేను నేపాల్ అధ్యక్షురాలు బిద్యా దేవి భండారి ఆ దేశ గౌర‌వ జ‌న‌ర‌ల్ ర్యాంక్‌తో స‌త్కరిస్తుండటం విశేషం.
Samayam Telugu ఆర్మీ చీఫ్ నరవణే
Indian Army chief MM Naravane


ఆర్మీ చీఫ్ న‌ర‌వణే నేపాల్ పర్యటన గురించి నేపాల్ ఆర్మీ అధికార ప్రతినిధి బ్రిగేడియర్ జనరల్ సంతోశ్ పౌదెల్ ప్రకటన చేశారు. నరవణే నవంబర్ నెలలో ఖాడ్మండు పర్యటనకు వస్తారని తెలిపారు. నిర్దిష్ట తేదీలను మాత్రం వెల్లడించలేదు. వాస్తవానికి ఆర్మీ చీఫ్ నరవణే ఫిబ్రవ‌రి 3నే ఖాడ్మండులో పర్యటించడానికి ముహూర్తం ఖరారు కాగా.. ఇరు దేశాల్లో కరోనా వ్యాప్తి తదంనతర పరిస్థితుల నేపథ్యంలో ఆ ప‌ర్యటన వాయిదా ప‌డింది.

నేపాల్ వివాదాస్పద మ్యాప్‌ను రిలీజ్ చేసిన ఘ‌ట‌న త‌ర్వాత ఆర్మీ చీఫ్ న‌ర‌వణే ఆ దేశానికి వెళ్లడం ఇదే తొలిసారి. రెండు దేశాల మ‌ధ్య జ‌రుగుతున్న ఉన్నత స్థాయి బృందం సందర్శన కూడా ఇదే కానుండటం గమనార్హం. 1950 నుంచి ఇరు దేశాలు ఆర్మీ చీఫ్‌ల‌ను ప‌రస్పరం స‌త్కరించుకుంటున్నాయి. ఈ సాంప్రదాయంలో భాగంగానే న‌ర‌వణే నేపాల్ పర్యటనకు వెళ్లనున్నారు.

లిపులేక్ మీదుగా మాన‌స‌స‌రోవ‌రానికి ఇటీవ‌ల భార‌త్ కొత్త మార్గాన్ని ఓపెన్ చేసిన విష‌యం తెలిసిందే. ఈ అంశంలో నేపాల్ అభ్యంత‌రం వ్యక్తం చేసింది. భార‌త్‌లోని కాలాపాని, లిపులేక్‌, లింపియాదురా ప్రాంతాల‌ను క‌లుపుకుని నేపాల్ జూన్ 9న కొత్త మ్యాప్‌ను రిలీజ్ చేసింది. దీనిపై భారత ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం తెలిపింది. ఆర్మీ చీఫ్ నరవణే కూడా ఈ అంశంపై తీవ్రంగా స్పందించారు. ఇతరుల ప్రోద్బలంతోనే నేపాల్ ఇలాంటి దుందుడుకు చర్యలకు పాల్పడుతోందని వ్యాఖ్యానించారు. చైనా ప్రభావంతోనే నేపాల్ ఇలా చేస్తోందని పరోక్షంగా చురకలు వేశారు.

Also Read: కాంగ్రెస్‌కు తెలివైన మహిళలు అక్కర్లేదు: ఖుష్బూ

Must Read: మూసీకి ఎన్నడూ లేనంత వరద.. డ్యామ్‌కు ప్రమాదం ఉందా?

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.