యాప్నగరం

సరిహద్దుల్లో విజృంభించిన భారత ఆర్మీ

ఇన్నాళ్లు సహనంతో ఉన్న భారత ఆర్మీ శత్రువుతో ఢీ అంటే ఢీ అంటోంది. పొరుగుదేశం పాకిస్థాన్ నియంత్రణ రేఖ దాటుకొని భారత సైన్యం దాడులు ప్రారంభించింది. 

TNN 29 Sep 2016, 1:48 pm
 ఇన్నాళ్లు సహనంతో ఉన్న భారత ఆర్మీ శత్రువుతో ఢీ అంటే ఢీ అంటోంది. పొరుగుదేశం పాకిస్థాన్ నియంత్రణ రేఖ దాటుకొని భారత సైన్యం దాడులు ప్రారంభించింది. బుధవారం రాత్రి పాక్ భూభాగంలోకి అడుగుపెట్టిన ఇండియన్ ఆర్మీ..ఉగ్రవాద కార్యకలపాలు చేపట్టే అవకాశమున్న అన్ని ‘దారుల్లో’నూ దాడులు చేసింది. తాము పాక్ భూభాగంలో సర్జికల్ స్ట్రైక్స్ (సునిశిత దాడులు) చేసింది నిజమేనని డీజీఎంవో లెఫ్టినెంట్ జనరల్ రణ్ బీర్ సింగ్ ప్రకటించారు. ఇంటలిజిన్స్ వర్గాలు ఇచ్చిన సమాచారం మేరకే అక్రమ చొరబాటుదార్లను ఏరివేసేందుకే తాము ఈ దాడులు చేసినట్లు ఆయన తెలిపారు. అయితే ఈ దాడుల్లో ఎవరైనా చిక్కారా? చనిపోయారా? అన్న విషయాన్ని స్పష్టంగా వివరించలేదు. తీవ్రవాద చర్యలను దిగుతున్న వారికి ఇదో హెచ్చరిక అని ఆయన స్పష్టం చేశారు. టెర్రరిస్టు చర్యలు ఆపేలా చర్యలు తీసుకోవాలని ఎన్నిసార్లు విన్నవించినా పాక్ వినిపించుకోలేదని సింగ్ గుర్తు చేశారు. తాము దాడులు చేస్తున్న సంగతి పాకిస్థాన్ కు కూడా సమాచారం ఇచ్చామని సింగ్ తెలిపారు. సర్జికల్ స్ట్రైక్స్ పై సింగ్ రాష్ట్రపతి, ప్రధానులకు బ్రీఫింగ్ ఇచ్చారు.
Samayam Telugu indian army conducted surgical strikes at loc
సరిహద్దుల్లో విజృంభించిన భారత ఆర్మీ


 
India Army has launched surgical strikes to LOC on Wednesday night, said DGMO Lt. General Ranbir Singh. These strikes were conducted based on the intelligence inputs of terror group that ready to infiltrate into India, he added.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.