యాప్నగరం

ఆర్మీ హెలికాప్టర్ క్రాష్.. పైలట్ మృతి

Dhruv Chopper Crash: ఆర్మీకి చెందిన ధ్రువ్ హెలికాప్టర్ కుప్పకూలింది. జమ్మూకశ్మీర్‌లోని కథువా జిల్లాలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒక పైలట్ మరణించగా, మరో పైలట్ తీవ్ర గాయాలతో ప్రాణాలతో పోరాడుతున్నారు.

Samayam Telugu 26 Jan 2021, 12:58 am
ఇండియన్ ఆర్మీకి చెందిన ధ్రువ్ హెలికాప్టర్‌ క్రాష్ అయింది. ఈ ఘటనలో ఓ పైలట్ మృతి చెందగా, తీవ్రంగా గాయపడిన మరో పైలట్ పరిస్థితి విషమంగా ఉంది. జమ్ముకశ్మీర్‌-పంజాబ్ సరిహద్దు ప్రాంతంలో సోమవారం (జనరి 25) రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. సాంకేతిక లోపంతోనే ఈ ఘటన జరిగినట్లు అధికారులు భావిస్తున్నారు. క్రాష్ ల్యాండ్ కావడం వల్ల హెలికాప్టర్‌కు మంటలు అంటుకొని దగ్ధమైనట్లు తెలుస్తోంది.
Samayam Telugu ధ్రువ్ హెలికాప్టర్ (ఫైల్ ఫొటో)
Dhruv helicopter


జమ్మూకశ్మీర్‌లోని కథువా జిల్లా లఖన్‌పూర్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. హెలికాప్టర్‌లో ఉన్న ఇద్దరు పైలట్లు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న అధికారులు ఘటనా స్థలికి చేరుకొని వారిని వెంటనే హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఒక పైలట్‌ మరణించారు.

ధ్రువ్ హెలికాప్టర్లను హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ (HAL) రూపొందించింది. ప్రమాద ఘటనపై ఆర్మీ అధికారులు దర్యాప్తునకు ఆదేశించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.