యాప్నగరం

భూటాన్‌లో కూలిన ఇండియన్ ఆర్మీ హెలికాప్టర్.. బర్త్‌డే రోజున పైలట్ దుర్మరణం

Indian Army Pilot Killed on Birthday: ఇండియన్ ఆర్మీకి చెందిన చీతా విమానం భూటాన్‌లో కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు పైలట్లు మృతి చెందారు. భారత ఆర్మీకి చెందిన పైలట్ తన పుట్టిన రోజునే ప్రాణాలో కోల్పోయారు.

Samayam Telugu 27 Sep 2019, 9:41 pm
ఇండియన్ ఆర్మీకి చెందిన హెలికాప్టర్‌ ఒకటి భూటాన్‌లో కుప్పకూలింది. ఈ ఘటనలో ఇద్దరు పైలట్లు దుర్మరణం పాలయ్యారు. శుక్రవారం (సెప్టెంబర్ 27) మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో భూటాన్‌లోని ఖెంటాంగ్మనీ పర్వత శ్రేణుల్లో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. మరి కొద్దిసేపట్లో ల్యాండ్‌ అవుతుందనగా రాడార్‌తో సంకేతాలు తెగిపోయి కంప్యూటర్ తెర పైనుంచి హెలికాప్టర్ అదృశ్యమైంది. ఆ తర్వాత కొద్దిసేపటికే పర్వత ప్రాంతంలో కూలిపోయింది.
Samayam Telugu Indian Army


భారత మిలిటరీ శిక్షణ బృందానికి చెందిన చీతా హెలికాప్టర్‌ విధుల్లో భాగంగా శుక్రవారం మధ్యాహ్నం అరుణాచల్‌ ప్రదేశ్‌లోని ఖిర్ము ప్రాంతం నుంచి భూటాన్‌లోని యాంగ్‌ఫుల్లా ఎయిర్‌ బేస్‌కు బయల్దేరిందని ఇండియన్ ఆర్మీ అధికార ప్రతినిధి కల్నల్ అమన్ ఆనంద్ తెలిపారు. మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత యాంగ్‌ఫుల్లాకు అతి సమీపంలో ఈ హెలికాప్టర్‌ గ్రౌండ్‌ కేంద్రంతో సంబంధాలు కోల్పోయిందని.. ఆ తర్వాత పర్వత ప్రాంతంలో కూలిపోయిందని వెల్లడించారు.

Also Read: హెచ్‌సీఏ ఎన్నికల్లో కేటీఆర్ సహకారం.. టీఆర్‌ఎస్‌లోకి అజారుద్దీన్!

రాడార్‌తో హెలికాప్టర్ సంబంధాలు తెగిపోయినట్లు గుర్తించగానే అధికారులు రెస్క్యూ ఆపరేషన్‌ చేపట్టినట్లు కల్నల్ ఆనంద్ తెలిపారు. కాసేపటికే ఖెంటాంగ్మనీ పర్వత ప్రాంతాల్లో హెలికాప్టర్‌ శకలాలను గుర్తించినట్లు వెల్లడించారు. ప్రమాదంలో ఇద్దరు పైలట్లు అక్కడికక్కడే దుర్మరణం పాలైనట్లు తెలిపారు. ప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉందని.. ఘటనపై దర్యాప్తునకు ఆదేశించామని ఆయన చెప్పారు.

Must Read: పెళ్లి కోసం రెండేళ్లు ఆగలేను.. పాతబస్తీలో 16 ఏళ్ల బాలిక ఆత్మహత్య

పుట్టిన రోజు నాడే మృత్యు ఒడికి..
ఘటనలో మృతి చెందిన ఇద్దరు పైలట్లలో ఒకరు భారత ఆర్మీకి చెందిన లెఫ్టినెంట్‌ కల్నల్‌ రాజ్‌నీత్ పర్మర్ కాగా.. మరొకరు భారత సైన్యంతో కలిసి శిక్షణ తీసుకుంటున్న భూటానీస్ రాయల్ ఆర్మీ పైలట్‌ కెప్టెన్ కల్జంగ్ వాంగ్డీ ఉన్నారు. రాజ్‌నీత్ శుక్రవారం తన పుట్టిన రోజు జరుపుకొంటున్నట్లు ఆర్మీ అధికారులు వెల్లడించారు. పుట్టిన రోజునే ఆయన మృత్యు ఒడికి చేరడం కుటుంబ సభ్యుల్లో తీరని విషాదం నింపింది.

Don't Miss: ఐరాస వేదికగా ప్రధాని మోదీ శాంతి మంత్రం..

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.