యాప్నగరం

గల్వాన్‌ లోయలో మరో జవాన్ మృతి

Ladakh: చైనా సరిహద్దులోని గల్వాన్ లోయలో మరో సైనికుడు అమరుడయ్యారు. నదిలో పడిపోయిన సైనికులను కాపాడే క్రమంలో అమరులైనట్లు కేంద్ర మంత్రి సతేజ్ పాటిల్ తెలిపారు.

Samayam Telugu 25 Jun 2020, 7:03 pm
ఢక్‌లో గల్వాన్ లోయలో మరో జవాన్ అమరుడయ్యారు. భారత్, చైనా సరిహద్దులోని నదిలో పడిపోయిన ఇద్దరు జవాన్లను కాపాడే క్రమంలో సైనికుడు కన్నుమూసినట్లు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి సతేజ్ పాటిల్ గురువారం (జూన్ 25) తెలిపారు. అమరుడైన సైనికుడు సచిన్ విక్రమ్ మోరే.. మహారాష్ట్రలోని నాసిక్ జిల్లా మాలేగావ్‌ తాలూకా సాకురి గ్రామానికి చెందిన వారిగా వెల్లడించారు. ఈ విషయాన్ని ఆర్మీ వర్గాలు కూడా ధ్రువీకరించాయి.
Samayam Telugu భారత్, చైనా సరిహద్దులోని గల్వాన్ నది
Galwan River


సచిన్ విక్రమ్ మోరేతో పాటు నదిలో పడిపోయిన ఇద్దరు జవాన్లు కూడా గల్వాన్ లోయలో విధులు నిర్వహిస్తున్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు. అయితే.. ఈ ఘటన ఎప్పుడు జరిగింది? జవాన్ సచిన్ మోరే గాయాలు కావడం వల్ల మృతి చెందారా? నదిలో గల్లంతయ్యారా? అనే వివరాలపై స్పష్టత రావాల్సి ఉంది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

గల్వాన్ లోయలో జూన్ 15న చైనా బలగాలతో జరిగిన ఘర్షణలో 20 మంది జవాన్లు అమరులైన సంగతి తెలిసిందే. చైనా వైపు ఏం జరిగిందనేది మాత్రం డ్రాగన్ వెల్లడించలేదు. ఇద్దరు జవాన్లు, ఓ కమాండింగ్ ఆఫీసర్ మరణించినట్లు తెలిపింది. చైనా వైపు వచ్చిన అంబులెన్స్‌లు, హెలికాప్టర్లు, చైనీయుల సంభాషణ ఆధారంగా 40 మంది కంటే ఎక్కుక మంది జవాన్లు మరణించినట్లు అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి. భారత్ జవాన్ల చేతిలో ఎదురైన పరాభవాన్ని బీజింగ్ అవమానంగా భావిస్తున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి.

Photo Credit: Getty Images

Also Read: గల్వాన్ అంటే దొంగ అని అర్థం, దాని వెనుక ఆసక్తికర నేపథ్యం

Also Read: మళ్లీ మిడతల దాడి.. పాక్ నుంచి కొత్త దండు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.