యాప్నగరం

కూలిన బ్రిడ్జి గంటల వ్యవధిలో ప్రత్యక్షం.. దటీజ్ ఇండియన్ ఆర్మీ

Indian Army: అమర్‌నాథ్ యాత్రా మార్గంలో కొండచరియలు విరిగిపడటం వల్ల కొట్టుకుపోయిన బ్రిడ్జిని ఇండియన్ ఆర్మీ జవాన్లు రికార్డు టైమ్‌లో పునరుద్ధరించారు.

Authored byశ్రీనివాస్ గంగం | Samayam Telugu 3 Jul 2022, 12:47 am
మర్‌నాథ్ యాత్రా మార్గంలో కూలిన బ్రిడ్జిని గంటల వ్యవధిలోనే పునరుద్ధరించి ఔరా అనిపించింది ఇండియన్ ఆర్మీ. ఆర్మీకి చెందిన చినార్ కార్ప్స్ (Chinar Corps) ఈ ఘనత సాధించింది. హిమాలయ పర్వత శ్రేణుల్లో, 3880 మీటర్ల ఎత్తులో కొనసాగే అమర్‌నాథ్ యాత్ర జూన్ 30న తిరిగి ప్రారంభమైన సంగతి తెలిసిందే. రెండేళ్ల తర్వాత పూర్తి స్థాయిలో ప్రారంభమైన ఈ యాత్రకు ఈసారి భక్తులు పోటెత్తారు. అటు ఉగ్రవాద దాడులు జరిగే ముప్పు ఉండటంతో యాత్ర జరిగే మార్గంలో భద్రతా బలగాలను పెద్ద సంఖ్యలో మోహరించారు.
Samayam Telugu అమర్‌నాథ్ యాత్ర
Amarnath Yatra


ఇండియన్ ఆర్మీకి చెందిన చినార్ కార్ప్స్.. అమర్‌నాథ్ యాత్రకు సంబంధించిన ఏర్పాట్లను పర్యవేక్షిస్తోంది. ఉష్ణోగ్రతల్లో పెరుగుదల కారణంగా జూన్ 30, జులై 1 మధ్య రాత్రి మంచు చరియలు విరిగిపడి యాత్రా మార్గంలో బల్తాల్ వద్ద వంతెనలు కొట్టుకుపోయాయి. కాళీ మాతా ఆలయ సమీపంలోని ప్రవాహం వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది.

బ్రిడ్జి కొట్టుకుపోయిన విషయాన్ని గమనించిన ఆర్మీ జవాన్లు.. వెంటనే పునరుద్ధరణ చర్యలు చేపట్టారు. ప్రత్యేక హెలికాప్టర్‌లో బ్రిడ్జి నిర్మాణానికి అవసరమైన కర్రలు, సరకును తరలించారు. ఇంజినీర్ రెజిమెంట్‌కు చెందిన సభ్యులను, సాంకేతిక నిపుణులను అక్కడికి తరలించారు. వెంటనే పనులు ప్రారంభించి కేవలం 4 గంటల్లోనే అక్కడ కొత్త బ్రిడ్జిని నిర్మించారు. అమర్‌నాథ్ యాత్ర నిరాటంకంగా కొనసాగేలా చేశారు.

Bridge


సరిహద్దులో పహారా కాయడమే కాదు, ఆపద సమయాల్లో సాహసోపేతమైన చర్యలతో ఇండియన్ ఆర్మీ.. అందరి మనసులను గెలుచుకుంటోంది. అమర్‌నాథ్ యాత్ర కొనసాగే మార్గంలో సున్నితమైన ప్రాంతాల్లో భద్రతా బలగాలను భారీగా మోహరించారు. 200 హైపవర్డ్ బుల్లెట్‌ప్రూఫ్ వాహనాలను సిద్ధంగా ఉంచారు. జవాన్లతో పాటు 130 స్నిఫర్ డాగ్స్ ఇక్కడ విలువైన సేవలు అందిస్తున్నాయి.
రచయిత గురించి
శ్రీనివాస్ గంగం
శ్రీనివాస్ రెడ్డి గంగం సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ అంశాలపై వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. EJS నుంచి శిక్షణ పొందిన శ్రీనివాస్‌కు జర్నలిజంలో 12 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. JNTU నుంచి BTech చేశారు. గతంలో ప్రముఖ పత్రికల్లో వార్తలు, విద్యా సంబంధిత అంశాలు అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.