యాప్నగరం

సరిహద్దులో దారి తప్పిన చైనీయులు... రక్షించి, సాయం చేసిన ఇండియన్ ఆర్మీ!

సిక్కిం సరిహద్దుల్లో దారి తప్పిన చైనీయులకు భారత సైన్యం సాయం చేసింది. వారికి ఆహారం, ఆక్సిజన్ అందించడంతోపాటు.. సురక్షితంగా తిరిగి వెళ్లడానికి తోడ్పాటు అందించింది.

Samayam Telugu 5 Sep 2020, 3:06 pm
భారత్, చైనా మధ్య సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఇరు దేశాలు ఎల్ఏసీ వెంబడి భారీగా బలగాలను మోహరించాయి. చైనా సైన్యం అరుణాచల్ ప్రదేశ్‌లో ఐదుగురు పౌరుల్ని అపహరించిందనే ఆరోపణలొస్తున్నాయి. కానీ భారత సైన్యం మాత్రం తన గొప్ప మనసు చాటుకుంది. దారి తప్పిన ముగ్గురు చైనీయులు ఉత్తర సిక్కింలోకి వచ్చారు. 17,500 అడుగుల ఎత్తులో మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రతలో దారి తప్పిన వారికి ఇండియన్ ఆర్మీ వెంటనే వైద్య సాయం అందించింది.
Samayam Telugu army helps chinese


మన సైన్యం చైనీయులకు ఆక్సిజన్, ఆహారంతోపాటు చలి నుంచి కాపాడుకోవడానికి ఉన్ని దుస్తులు ఇచ్చింది. వారు కోలుకున్నాక గమ్యం చేరడానికి సహకరించింది. ఈ విషయాన్ని ఇండియన్ ఆర్మీ ట్వీట్టర్ ద్వారా వెల్లడించింది. మానవత్వానికే తొలి ప్రాధాన్యం ఇస్తామని తెలిపింది.
Read Also: ఐదుగురు భారతీయుల్ని కిడ్నాప్ చేసిన చైనా ఆర్మీ

శనివారం రాత్రి సిక్కింలో ఈ ఘటన చోటు చేసుకుంది. కాగా అరుణాచల్ ప్రదేశ్‌లోని ఎగువ సుబాన్‌సిరి జిల్లాలో ఐదుగురు వేట కోసం అడవికి వెళ్లారు. వారి ఆచూకీ లభ్యం కాకపోవడంతో వారి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీరిని చైనా సైన్యం అపహరించిందని కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆరోపిస్తున్నారు.

Read Also: పశ్చిమ గోదావరి: ప్రాణం తీసిన స్కూటీ స్టాండ్

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.