యాప్నగరం

పాక్ కాల్పులకు దీటుగా బదులిచ్చిన భారత్.. జవాన్ మృతి, 8 మందికి గాయాలు

Jammu Kashmir: సరిహద్దు వెంట కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న పాకిస్థాన్ సైనికులకు ఇండియన్ ఆర్మీ షాకిచ్చింది. భారత భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో పాక్‌కు చెందిన ఓ జవాన్ మృతి చెందగా.. మరో 8 మంది గాయపడ్డారు.

Samayam Telugu 27 Jul 2020, 10:35 pm
నియంత్రణ రేఖ వెంట కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న పాక్ సైన్యానికి భారత భద్రతా దళాలు షాక్ ఇచ్చాయి. పాక్ జవాన్లు జరిపిన కాల్పులకు ప్రతిగా భారత సైనికులు చేసిన కాల్పుల్లో.. దాయాది దేశానికి చెందిన ఓ జవాన్ మరణించగా.. మరో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. కశ్మీర్‌లోని పూంచ్ సెక్టార్‌లో సోమవారం (జులై 27) ఈ ఘటన చోటు చేసుకుంది.
Samayam Telugu ఇండియన్ ఆర్మీ (ప్రతీకాత్మక చిత్రం)
India Army In Jammu Kahmir


హజీపూర్, పూంచ్, ఛాంబ్, రాక్ చిక్రీ సెక్టార్లలో పాక్ ఆర్మీ కాల్పులకు పాల్పడిందని ఇండియన్ ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. భారత భద్రతా బలగాలు ఈ దాడులను దీటుగా తిప్పి కొట్టాయని తెలిపాయి. ఫలితంగా పాక్ వైపు నష్టం వాటిల్లిందని వెల్లడించాయి.

పాకిస్థాన్ సైన్యం పదే పదే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ సరిహద్దు వెంట పలు ప్రాంతాల్లో కాల్పులకు తెగబడుతోంది. ఈ కాల్పుల్లో భారత జవాన్లతో పాటు సరిహద్దు గ్రామాలకు చెందిన పౌరులు గాయపడుతున్నారు. కొంత మంది ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. సరిహద్దు గ్రామాల ప్రజల ఇళ్లు ధ్వంసమవుతున్నాయి.

Also Read: మిరాకిల్ ఎస్కేప్.. యాక్సిడెంట్ అతడి ప్రాణాలను కాపాడింది, వీడియో వైరల్

Don't Miss: అన్‌లాక్ 3.0: సినీ ప్రియులకు గుడ్ న్యూస్?

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.