యాప్నగరం

పాకిస్థాన్‌కి ఇండైరెక్ట్ వార్నింగ్ ఇచ్చిన ఇండియన్ ఆర్మీ

పాకిస్థాన్ ఇంకా తమని రెచ్చగొట్టొద్దని, లేదంటే ఇది కేవలం శాంపిల్ మాత్రమే అనే సందేశాన్ని ఇచ్చింది ఇండియన్ ఆర్మీ.

Times Now 8 May 2017, 11:05 am
దేశ సరిహద్దులు దాటుకుని 250 మీటర్లు లోపలికి చొచ్చుకొచ్చి, భారత సైనికుల దేహాలని చిద్రం చేసిన పాక్ సైన్యానికి పరోక్షంగానే గట్టి వార్నింగ్ ఇచ్చింది ఇండియన్ ఆర్మీ. తాము తల్చుకుంటే ఏమైనా చేయగలం అని చెప్పడానికి ఉదాహరణగా లైన్ ఆఫ్ కంట్రోల్ రేఖని ఆనుకుని పాక్ భూభాగంలో వున్న పాక్ సైన్యం బంకర్‌ని విజయవంతంగా పేల్చేసింది భారత సైన్యం. పాక్ బంకర్ లక్ష్యంగా దాడి జరిపిన భారత సైన్యం.. బంకర్‌ని నామరూపాల్లేకుండా ధ్వంసం చేసింది.
Samayam Telugu indian army takes revenge for death of jawans destroys pak bunkers along loc
పాకిస్థాన్‌కి ఇండైరెక్ట్ వార్నింగ్ ఇచ్చిన ఇండియన్ ఆర్మీ


పాకిస్థాన్ ఇంకా తమని రెచ్చగొట్టొద్దని, లేదంటే ఇది కేవలం శాంపిల్ మాత్రమే అనే సందేశాన్ని ఇచ్చింది ఇండియన్ ఆర్మీ. ఇండియన్ ఆర్మీ కేవలం 60 సెకన్లలోనే పాక్ బంకర్‌ని నేలమట్టం చేసిన దృశ్యం, సైనికులు జరిపిన ఈ ఆపరేషన్‌కి సంబంధించిన వీడియో ఇది. తాము ప్రతీకా దాడులకి పాల్పడితే పరిణామాలు తీవ్రంగా వుంటాయని పాకిస్థాన్‌ని హెచ్చరించడానికే ఇండియన్ ఆర్మీ ఈ దాడికి పాల్పడినట్టు తెలుస్తోంది. 6 మెగా రాకెట్ లాంచర్ల ద్వారా ఇండియన్ ఆర్మీ ఈ ఆపరేషన్ పూర్తి చేసినట్టు సమాచారం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.