యాప్నగరం

కట్నం కోసం కిడ్నీ అమ్మేశాడు..!

కట్నం కోసం కట్టుకున్న భార్య కిడ్నీనే అమ్మేశాడు ఓ ఘనుడు. ఇటీవల బాధితురాలకి కడుపునొప్పి రావడంతో ఆమెను

TNN 11 Feb 2018, 9:12 am
కట్నం కోసం కట్టుకున్న భార్య కిడ్నీనే అమ్మేశాడు ఓ ఘనుడు. ఇటీవల బాధితురాలకి కడుపునొప్పి రావడంతో ఆమెను బంధువులు ఆసుపత్రికి తీసుకెళ్లగా విషయం బయటపడింది. కోల్‌కతాకి చెందిన బిశ్వజిత్‌కు 2005లో రీటాతో వివాహమైంది. పెళ్లి సమయంలో కట్నం కింద రూ.2లక్షలు ఇచ్చేందుకు రీటా తల్లిదండ్రులు అంగీకరించారు. కానీ.. ఆర్థిక ఇబ్బందులు కారణంగా వారు ఆ డబ్బుని ఇవ్వలేకపోయారు. అయితే అప్పటి నుంచి కట్నం తేవాల్సిందిగా భార్యని బిశ్వజిత్ వేధించసాగాడు.
Samayam Telugu indian man arrested after allegedly selling wifes kidney which she didnt even know was gone
కట్నం కోసం కిడ్నీ అమ్మేశాడు..!


రెండేళ్ల క్రితం రీటాకి కడుపునొప్పి రావడంతో బిశ్వజిత్ ఆసుపత్రికి తీసుకెళ్లి ఆపరేషన్ చేయించాడు. అందరికీ అపెండిక్స్ అని అప్పట్లో చెప్పాడు. అయితే.. ఇటీవల మళ్లీ రీటాకి కడుపునొప్పి రాగా.. బంధువులు ఆసుపత్రికి తరలించారు. అక్కడ స్కాన్ చేసిన డాక్టర్లు.. రీటాకి కుడివైపు కిడ్నీ లేదని తేల్చారు. దీంతో కంగారుపడిన బంధువులు బిశ్వజిత్‌ని నిలదీయగా.. రెండేళ్లక్రితమే కట్నం డబ్బులకి బదులుగా అమ్మేసినట్లు నిర్లక్ష్యంగా సమాధానమిచ్చాడు. దీంతో భర్త, ఆసుపత్రిపై పోలీసులకి రీటా ఫిర్యాదు చేసింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.