యాప్నగరం

Varuna Drone: మనుషులను మోసుకెళ్లగలిగే డ్రోన్ ఇది.. దేశంలోనే ఫస్ట్ టైం..

Varuna Drone: రద్దీగా ఉండే రోడ్డు మీద యాక్సిడెంట్ అయ్యింది. ట్రాఫిక్ జామ్ కారణంగా అంబులెన్స్ వెళ్లడానికి కూడా దారి లేదు. అలాంటి పరిస్థితుల్లో క్షతగాత్రులను కాపాడటం ఆలస్యం అవుతుంది కదూ. కానీ ఇలాంటి సందర్భాల్లో ఉపయుక్తంగా ఉండేలా సాగర్ డిఫెన్స్ అనే సంస్థ మనుషులను మోసుకెళ్లగలిగే డ్రోన్లను తయారు చేసింది. ఈ డ్రోన్లను త్వరలోనే నేవీలో ప్రవేశపెట్టనున్నారు. నిఘా కోసం.. సైనికులకు సాయం చేయడానికి, ఆయుధాలను తరలించడానికి ఈ డ్రోన్లు ఉపయోగపడనున్నాయి.

Authored byరవి కుమార్ | Samayam Telugu 5 Oct 2022, 1:15 pm

ప్రధానాంశాలు:

  • మనుషులను మోసుకెళ్లగలిగే డ్రోన్‌ను తయారు చేసిన సాగర్ డిఫెన్స్
  • దేశంలో ఇలాంటి డ్రోన్ తయారీ ఇదే ప్రథమం
  • త్వరలోనే ఇండియన్ నేవీకి అందుబాటులోకి ఈ డ్రోన్ సేవలు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Varuna Drone
Varuna Drone
చిన్న పరిమాణంలో ఉండి.. చిన్న చిన్న వస్తువులను తీసుకెళ్లే డ్రోన్లనే ఇప్పటి వరకూ చూసి ఉంటారు. కానీ పుణేకు చెందిన సాగర్ డిఫెన్స్ ఇంజినీరింగ్ ప్రయివేట్ లిమిటెడ్ అనే ఓ స్టార్టప్ కంపెనీ మనుషులను మోసుకెళ్లగలిగే డ్రోన్లను రూపొందించింది. పుణే సంస్థ తయారు చేసిన ఈ డ్రోన్‌లో ఒక వ్యక్తి ప్రయాణించొచ్చు. ఈ ఏడాది జులైలో నిర్వహించిన నేవల్ ఇన్నోవేషన్ అండ్ ఇండిజెనైజేషన్ సెమినార్‌లో ఈ డ్రోన్‌ను ప్రదర్శించారు.

వరుణ అని నామకరణం చేసిన ఈ డ్రోన్‌ను త్వరలోనే ఇండియన్ నేవీలో ప్రవేశపెట్టనున్నారు. తాము తయారు చేసిన డ్రోన్ ద్వారా ద్రవాలు, పరికరాలు, మనుషులను తీసుకెళ్లొచ్చని సాగర్ డిఫెన్స్ ఇంజినీరింగ్ ప్రయివేట్ లిమెటెడ్ వెల్లడించింది.
ఈ ప్యాసింజర్ డ్రోన్‌ను రిమోట్ ద్వారా నియంత్రించొచ్చు లేదంటే ముందుగా నిర్ణయించిన రూట్లలో ఇది ఆటోమేటిక్‌గా గాల్లోకి ఎగురుతుంది. 130 కిలోల వరకు బరువును మోయగల ఈ డ్రోన్ అరగంటలోనే 25 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది.
సాగర్ డిఫెన్స్ వ్యవస్థపాకుడైన కెప్టెన్ నింకుజ్ పరశార్, సహ వ్యవస్థాపకులైన బబ్బర్, లక్షయ్ డాంగ్‌తో కలిసి ఇండియన్ నేవీ కోసం ఈ డ్రోన్‌కు రూపకల్పన చేశారు. యుద్ధ క్షేత్రాల్లో సైనికులను సురక్షితంగా తరలించడానికి ఈ డ్రోన్లను ఉపయోగించనున్నారు. నిఘా కోసం కూడా ఈ డ్రోన్లను ఉపయోగించొచ్చు.

ఈ ప్రాజెక్ట్ ప్రారంభంలో నిధుల సమస్య తలెత్తింది. కానీ ఇండియన్ నేవీ, మజ్‌గావ్ డాక్‌యార్డ్ లిమిటెడ్ సహకారంతో నిధులు సమకూరాయి. యాక్సిడెంట్లు జరిగిన సమయంలో క్షతగాత్రులను హాస్పిటళ్లకు తీసుకెళ్లడానికి... మారుమూల ప్రాంతాల వారికి ఎయిర్‌ అంబులెన్స్‌గా.. మెట్రో నగరాల్లో ఎయిర్ ట్యాక్సీగా విపత్తుల సమయంలో వెంటనే తరలించడానికి ఈ డ్రోన్ ఉపయోగపడనుంది.
రచయిత గురించి
రవి కుమార్
రవి కుమార్ సమయం తెలుగులో ప్రిన్సిపల్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. స్పోర్ట్స్, ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 12 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వార్తలు, ఎడ్యుకేషన్ సంబంధింత అంశాలను అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.