యాప్నగరం

దేశంలో తొలి సోలార్ రైలు

సోలార్ పవర్‌తో నడిచే తొలి డీఈఎమ్‌యూ (డీజిల్‌, ఎలక్ట్రిక్‌ మల్టిపుల్‌ యూనిట్‌) రైలును భారతీయ రైల్వే..

TNN 15 Jul 2017, 2:33 pm
సోలార్ పవర్‌తో నడిచే తొలి డీఈఎమ్‌యూ (డీజిల్‌, ఎలక్ట్రిక్‌ మల్టిపుల్‌ యూనిట్‌) రైలును భారతీయ రైల్వే ఆవిష్కరించింది. ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్‌ రైల్వేస్టేషన్‌లో శుక్రవారం (జులై 14) రైల్వే మంత్రి సురేశ్‌ ప్రభు దీన్ని ప్రారంభించారు. పర్యావరణ పరిరక్షణకు, స్వచ్ఛ ఇంధన వినియోగానికి రైల్వే కట్టుబడి ఉందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఈ రైలు బోగీల్లోని లైట్లు, ఫ్యాన్లు, సైన్ బోర్డుల అవసరాలన్నింటికీ సౌరశక్తి ద్వారానే విద్యుత్ సమకూరనుంది. ఇందుకోసం బోగీల పైభాగంలో సౌర ఫలకాలు ఏర్పాటు చేశారు.
Samayam Telugu indian railways launches first solar powered demu train
దేశంలో తొలి సోలార్ రైలు


చెన్నైలోని ఇంటిగ్రల్‌ కోచ్‌ ఫ్యాక్టరీలో ఈ రైలును తయారుచేశారు. ఐఆర్‌వోఏఎఫ్‌ సౌర ఫలకాలను రూపొందించింది. ఆరు నెలల్లో మరో 24 బోగీలను రూపొందించనున్నారు. ఒక్కో బోగీ ద్వారా ఏడాదికి 9 టన్నుల కర్బన ఉద్గారాలు, రూ. 12 లక్షలు వ్యయం తగ్గనున్నట్లు అధికారులు తెలిపారు.

ఈ సందర్భంగా సురేశ్ ప్రభు ‘రైల్‌ సారథి’ అనే మొబైల్‌ యాప్‌ను ప్రారంభించారు. దీని ద్వారా రైల్వేకు సంబంధించిన అన్ని సేవలు అందుతాయని ఆయన తెలిపారు. ప్రతి రైల్లో 3 ఏసీ బోగీల్లో దివ్యాంగుల కోసం ఒక లోయర్‌ బెర్తు.. వారికి తోడుగా ఉండేవారి కోసం మిడిల్‌ బెర్తు రిజర్వు చేయనున్నట్లు ఆయన తెలిపారు. విదేశీయలకు అడ్వాన్స్‌ బుకింగ్‌ కాల వ్యవధిని 365 రోజుల నుంచి 120 రోజులకు తగ్గిస్తున్నట్లు చెప్పారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.