యాప్నగరం

పెట్రో ధరల మంట.. 26న భారత్ బంద్

Petrol Prices: పెరుగుతున్న పెట్రోల్ ధరలకు వ్యతిరేకంగా ఆల్ ఇండియా ట్రేడర్స్ యూనియన్ ఫిబ్రవరి 26న భారత్ బంద్‌కు పిలుపునిచ్చింది. ఈ బంద్‌లో దేశవ్యాప్తంగా 8 కోట్ల మంది పాల్గొననున్నారు.

Samayam Telugu 25 Feb 2021, 4:11 pm
పెరుగుతున్న పెట్రోల్ ధరలకు వ్యతిరేకంగా నిరసనలు ఉధృతమవుతున్నాయి. ఫిబ్రవరి 26న భారత్ బంద్‌కు పిలుపునిచ్చారు. ఆల్ ఇండియా ట్రేడర్స్ పిలుపునిచ్చిన ఈ బంద్‌లో దేశవ్యాప్తంగా 40 వేల ట్రేడ్ అసోసియేషన్స్ నుంచి సభ్యులు ఆందోళనల్లో పాల్గొననున్నారు. సుమారు 8 కోట్ల మంది ఈ బంద్‌లో పాల్గొనే అవకాశం ఉంది. రైతుల మాదిరిగా జాతీయ రహదారుల దిగ్బంధించడానికి ప్రణాళికలు రచిస్తున్నారు. వీరికి పలు వర్గాల నుంచి మద్దతు లభిస్తోంది.
Samayam Telugu పెట్రోల్
Petrol Prices


పెట్రోలియం ధరలతో పాటు ఇ-వే బిల్లు నిబంధనలు, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ (GST) తదితర అంశాలకు వ్యతిరేకంగా ఈ బంద్‌ చేపట్టనున్నారు. కాన్ఫడరేషన్‌ ఆఫ్‌ ఆలిండియా ట్రేడర్స్‌ పిలుపునిచ్చిన ఈ బంద్‌కు పలు కార్మిక సంఘాలు ఇప్పటికే మద్దతు ప్రకటించాయి. దీంతో పాటు అఖిల భారత వాహనదారుల సంక్షేమ సంఘం (ఆలిండియా ట్రాన్స్‌పోర్టర్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌-ఏఐటీడబ్ల్యూఏ) కూడా సంపూర్ణ మద్దతు పలికింది.

ఈ బంద్‌కు అన్ని రాష్ట్ర స్థాయి వాహనదారుల సంఘాలు మద్దతు ఇస్తాయని ఏఐటీడబ్ల్యూఏ అధ్యక్షుడు మహేంద్ర ఆర్య తెలిపారు. డీజిల్‌ ధరలు తగ్గించాలని.. దేశవ్యాప్తంగా ఒకే రకమైన ధరలు ఉండాలని ఆయన కోరారు. వ్యవసాయ చట్టాల రద్దు కోరుతూ రైతులు చేపట్టిన ‘చక్కా జామ్‌’ తరహాలో రహదారుల దిగ్బంధనం చేపడతామని కాన్ఫడరేషన్‌ ఆఫ్‌ ఆలిండియా ట్రేడర్స్‌ (సీఏఐటీ) ప్రకటించింది.

దేశంలోని కొన్ని ప్రాంతాల్లో పెట్రోల్‌ ధరలు ఇప్పటికే సెంచరీ మార్క్ దాటిన విషయం తెలిసిందే. డీజిల్‌ ధరలు కూడా దీనికి పోటీ పడుతూ పెరుగుతున్నాయి. దీంతో పేద, మధ్య తరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నానాటికీ పెరుగుతున్న ఇందన ధరలపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది.

Also Read:

మారుతీ నుంచి సరికొత్త స్విఫ్ట్.. లుక్ అదిరింది, ధర ఎంతంటే!

భార్యాబిడ్డలపై చిరుతపులి దాడి.. వీరోచితంగా పోరాడి చంపేశాడు

ప్రైవేట్ ఆస్పత్రుల్లో కరోనా టీకా.. త్వరలో ధరల నిర్ణయం, నామినల్ ఫీజే!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.