ఎన్డీయే హయాంలో తొలి మూడేళ్లలో మన వృద్ధి రేటు ప్రపంచంలోనే అత్యధికమని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. గురువారం పార్లమెంట్లో బడ్జెట్పై చర్చకు సమాధానం ఇచ్చిన అరుణ్ జైట్లీ.. నాలుగేళ్లలో ఆర్థిక వ్యవస్థను సుస్థిరం చేశామన్నారు. ఈ ఏడాది మాత్రమే కాస్త వెనుకబడ్డామని మంత్రి చెప్పారు. యూపీఏ హయాంలో భారత ఆర్థిక వ్యవస్థ ఇంత జోరుగా లేదని మంత్రి తెలిపారు. ప్రస్తుతం అమలు చేస్తున్న సంస్కరణలు కఠినంగా ఉన్నప్పటికీ.. మున్ముందు తప్పకుండా ఫలితాలు ఇస్తాయని జైట్లీ భరోసా ఇచ్చారు.
గత ప్రభుత్వ విధానాల లోపాల కారణంగా దేశం వెనుకబడిందని కాంగ్రెస్పై జైట్లీ విమర్శలు గుప్పించారు. యూపీఏ హయాంలో ఆరు శాతం ఉన్న ద్రవ్యోల్బణం రేటును మూడున్నర శాతానికి తగ్గించామని ఆయన చెప్పారు. కాంగ్రెస్ పార్టీ తాను చేస్తున్న విమర్శలపై ఆత్మ విమర్శ చేసుకోవాలని సూచించారు.
రాఫెల్ ఒప్పందం గురించి జైట్లీ స్పందిస్తూ.. దేశ భద్రతను ఫణంగా పెడుతున్నారంటూ కాంగ్రెస్ పార్టీని విమర్శించారు. ఈ వ్యాఖ్యల పట్ల హస్తం పార్టీ అభ్యంతరం వ్యక్తం చేసింది. రాఫెల్ కొనుగోళ్ల వివరాలను బయటపెట్టాలని పట్టుబట్టింది. ఆంధ్రా సమస్యల గురించి, రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన నిధుల గురించి జైట్లీ మాట్లాడుతున్న సమయంలో కాంగ్రెస్ పార్టీ ఆయన ప్రసంగానికి అడ్డు తగిలింది. విపక్షాలు ఆందోళనతో కాసపు సభలో గందరగోళం ఏర్పడింది. అనంతరం సభను శుక్రవారం ఉదయానికి వాయిదా వేశారు.
గత ప్రభుత్వ విధానాల లోపాల కారణంగా దేశం వెనుకబడిందని కాంగ్రెస్పై జైట్లీ విమర్శలు గుప్పించారు. యూపీఏ హయాంలో ఆరు శాతం ఉన్న ద్రవ్యోల్బణం రేటును మూడున్నర శాతానికి తగ్గించామని ఆయన చెప్పారు. కాంగ్రెస్ పార్టీ తాను చేస్తున్న విమర్శలపై ఆత్మ విమర్శ చేసుకోవాలని సూచించారు.
రాఫెల్ ఒప్పందం గురించి జైట్లీ స్పందిస్తూ.. దేశ భద్రతను ఫణంగా పెడుతున్నారంటూ కాంగ్రెస్ పార్టీని విమర్శించారు. ఈ వ్యాఖ్యల పట్ల హస్తం పార్టీ అభ్యంతరం వ్యక్తం చేసింది. రాఫెల్ కొనుగోళ్ల వివరాలను బయటపెట్టాలని పట్టుబట్టింది. ఆంధ్రా సమస్యల గురించి, రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన నిధుల గురించి జైట్లీ మాట్లాడుతున్న సమయంలో కాంగ్రెస్ పార్టీ ఆయన ప్రసంగానికి అడ్డు తగిలింది. విపక్షాలు ఆందోళనతో కాసపు సభలో గందరగోళం ఏర్పడింది. అనంతరం సభను శుక్రవారం ఉదయానికి వాయిదా వేశారు.