యాప్నగరం

దేశంలోనే అతి పొడవైన బ్రిడ్జిని ప్రారంభించనున్న మోడీ

ఈ నెల 26వ తేదీన దేశంలోనే అతి పొడవైన బ్రిడ్జిని ప్రారంభించనున్నారు ప్రధాని నరేంద్ర మోడీ.

TNN 14 May 2017, 9:06 pm
ఈ నెల 26వ తేదీన దేశంలోనే అతి పొడవైన బ్రిడ్జిని ప్రారంభించనున్నారు ప్రధాని నరేంద్ర మోడీ. చైనా సరిహద్దులకి సమీపంలో అస్సాంలో బ్రహ్మాపుత్రా నదిపై నిర్మించిన ఈ బ్రిడ్జి పొడవు 9.15 కి.మీ. దోళా - సడియా బ్రిడ్జిగా పేరున్న ఈ వంతెన నిర్మాణం 2011లో మొదలైంది. రూ.950 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ బ్రిడ్జి కారణంగా అస్సాం-అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల మధ్య సాగించే రాకపోకల్లో 4 గంటల సమయం ఆదా కానుంది.
Samayam Telugu indias longest river bridge will be inaugurated in assam by pm modi
దేశంలోనే అతి పొడవైన బ్రిడ్జిని ప్రారంభించనున్న మోడీ


60 టన్నుల యుద్ధ ట్యాంకర్‌ని మోయగలిగే శక్తిసామర్థ్యాలు కలిగిన ఈ బ్రిడ్జి నిర్మాణం వల్ల రెండు రాష్ట్రాల ప్రజలకి రాకపోకలు సాగించడానికి మార్గం సుగుమం అవడంతోపాటు ఈశాన్య ప్రాంతంలో మిలిటరీ కార్యక్రమాల విస్తరణకి వీలు కల్పించనుందని అస్సాం సీఎం సర్బానంద సొనొవాల్ పీటీఐకి తెలిపారు. అస్సాం రాజధాని దిస్పూర్‌కి 540 కి.మీ, అరుణాచల్ ప్రదేశ్ రాజధాని ఇటానగర్‌కి 300 కి.మీ దూరంలో వున్న ఈ బ్రిడ్జి.. వాయుమార్గం పరంగా చైనాకి 100 కి.మీ లోపే వుంటుంది.

బ్రహ్మాపుత్రా నదిపై తేజ్‌పూర్‌కి సమీపంలో కలియంబోరా వద్ద నిర్మించిన బ్రిడ్జి తర్వాత మరో 375 కి.మీ వరకు ఎక్కడా ఇంకో బ్రిడ్జి లేనే లేదు. కలియంబోరా తర్వాత ధోళా వద్ద నిర్మించిన ఈ బ్రిడ్దీనే రెండోది కావడం విశేషం. ముంబైలో బాంద్రా-వర్లిని కలిపే 3.55 కి.మీ పొడవైన సీ లింక్ కన్నా అధిక పొడవైన ఈ బ్రిడ్జి దేశంలోనే అతి పొడవైన బ్రిడ్జిగా గుర్తింపు పొందింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.