యాప్నగరం

ఓటేసిన భారత వృద్ధ ఓటరు..

హిమాచల్‌ ప్రదేశ్ పోలింగ్‌‌లో అద్భుతం ఆవిష్కృతమైంది. భారత్‌లోనే అత్యంత వృద్ధ ఓటరు.. శ్యామ్ సరణ్ నేగి (100) మరోసారి తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. కుమారుడి సాయంతో కిన్నౌర్ ప్రాంతంలోని కల్ప పోలింగ్ కేంద్రానికి తరలివచ్చిన ఆయన ఓటు వేసి.. దాని ప్రాధాన్నాన్ని యావత్‌ దేశానికి చాటిచెప్పారు.

TNN 9 Nov 2017, 6:16 pm
హిమాచల్‌ ప్రదేశ్ పోలింగ్‌‌లో అద్భుతం ఆవిష్కృతమైంది. భారత్‌లోనే అత్యంత వృద్ధ ఓటరు.. శ్యామ్ సరణ్ నేగి (100) మరోసారి తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. కుమారుడి సాయంతో కిన్నౌర్ ప్రాంతంలోని కల్ప పోలింగ్ కేంద్రానికి తరలివచ్చిన ఆయన ఓటు వేసి.. దాని ప్రాధాన్నాన్ని యావత్‌ దేశానికి చాటిచెప్పారు. శ్యామ్ సరణ్ నేగి భారత్‌లో అత్యంత వృద్ధ ఓటరు మాత్రమే కాదు.. స్వతంత్ర భారతావని తొలి ఓటరు కూడా ఆయనే కావడం విశేషం. నేగి 1951లో తొలిసారిగా తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. దేశ ప్రయోజనాల కోసం ప్రతి ఒక్కరూ తమ వంతు పాత్ర పోషించాలని ఓటు వేసిన అనంతరం నేగి పిలుపునిచ్చారు.
Samayam Telugu indias oldest voter 100 year old shyam saran negi cast his vote
ఓటేసిన భారత వృద్ధ ఓటరు..


వందేళ్ల ప్రాయంలోనూ ఓటు వేయడానికి ఉత్సాహంగా ముందుకొచ్చిన నేగికి పోలింగ్ కేంద్రంలో అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. ‘నాన్న ఈ రోజు (నవంబర్ 9) కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. శ్వాస తీసుకోవడంలో కాస్త ఇబ్బంది పడుతున్నా.. ఓటు వేయడానికి ఎంతో ఉత్సాహం చూపించారు’ అని నేగి కుమారుడు చందర్ ప్రకాశ్ తెలిపాడు.

మరోవైపు హిమాచల్ ప్రదేశ్ వాసులు ఓటింగ్ పాల్గొనడానికి ఉదయం నుంచే ఉత్సాహం చూపారు. పోలింగ్ సమయం ముగిసే సమయానికి రాష్ట్రవ్యాప్తంగా 65 శాతానికి పైగా ఓటింగ్ నమోదైంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా.. పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. అధికారులు పూర్తి వివరాలను వెల్లడించాల్సి ఉంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.