యాప్నగరం

భారీగా పెరిగిన రికవరీ రేటు.. గొప్ప ఊరట

దేశంలో ఓ వైసు కరోనా కేసులు పెరుగుతుండగా.. మరోవైపు రికవరీ రేటు కూడా మెరుగవుతుండటం సంతోషం కలిగించే వార్త.

Samayam Telugu 13 Aug 2020, 11:59 pm
దేశంలో కరోనా వైరస్‌ కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇదే సమయంలో కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య కూడా భారీగా పుంజుకోవడం ఊరట కలిగించే అంశం. దేశంలో కొవిడ్‌-19 నుంచి కోలుకున్న వారి సంఖ్య 17 లక్షలకు చేరిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గురువారం (ఆగస్టు 13) వెల్లడించింది. దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ రికవరీ రేటు 70.77 శాతానికి పెరిగిందని పేర్కొంది.
Samayam Telugu కరోనా రికవరీ రేటు
Corona recovery rate


యాక్టివ్‌ కేసుల కంటే కోలుకున్నవారి సంఖ్య పెరగడం విశేషం. గత 24 గంటల్లో రికార్డు స్థాయిలో 56,383 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో మొత్తం రికవరీల సంఖ్య 16,95,982కు చేరింది. ప్రస్తుతం దేశంలో 6,53,622 యాక్టివ్‌ కేసులున్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.