దేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇదే సమయంలో కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య కూడా భారీగా పుంజుకోవడం ఊరట కలిగించే అంశం. దేశంలో కొవిడ్-19 నుంచి కోలుకున్న వారి సంఖ్య 17 లక్షలకు చేరిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గురువారం (ఆగస్టు 13) వెల్లడించింది. దేశవ్యాప్తంగా కరోనా వైరస్ రికవరీ రేటు 70.77 శాతానికి పెరిగిందని పేర్కొంది.
యాక్టివ్ కేసుల కంటే కోలుకున్నవారి సంఖ్య పెరగడం విశేషం. గత 24 గంటల్లో రికార్డు స్థాయిలో 56,383 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో మొత్తం రికవరీల సంఖ్య 16,95,982కు చేరింది. ప్రస్తుతం దేశంలో 6,53,622 యాక్టివ్ కేసులున్నాయి.
యాక్టివ్ కేసుల కంటే కోలుకున్నవారి సంఖ్య పెరగడం విశేషం. గత 24 గంటల్లో రికార్డు స్థాయిలో 56,383 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో మొత్తం రికవరీల సంఖ్య 16,95,982కు చేరింది. ప్రస్తుతం దేశంలో 6,53,622 యాక్టివ్ కేసులున్నాయి.