యాప్నగరం

భారత్‌కు విచ్చేసిన ఇండోనేషియా అధ్యక్షుడు

ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడో భారత్ పర్యటనకు విచ్చేశారు.

TNN 12 Dec 2016, 7:00 pm
రెండు రోజుల పర్యటన కోసం ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడో భారత్ కు విచ్చేశారు. తన భార్యతో కలిసి వచ్చిన విడోడోకు రాష్ట్రపతి భవన్ వద్ద ఘన స్వాగతం లభించింది. ప్రధాని మోడీ స్వయంగా ఎదురేగి ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం విడోడో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిశారు. 2014లో అధ్యక్షుడిగా ఎన్నికైన విడోడో భారత్ కు రావడం ఇదే తొలిసారి. ఆయన ఆదివారం రాత్రికి ఇండియా చేరుకున్నారు. రాత్రవ్వడంతో ఎలాంటి స్వాగత కార్యక్రమాలు ఏర్పాటు చేయలేదు. అందుకోసం సోమవారం ఉదయం ఘన స్వాగత ఏర్పాట్లు చేశారు.
Samayam Telugu indonesian president joko widodo arrives in india
భారత్‌కు విచ్చేసిన ఇండోనేషియా అధ్యక్షుడు


విడోడో తన భార్య ఇరియానాతో పాటూ కొందరు మంత్రులను, సీనియర్ అధికారులను, 22 మంది వ్యాపారవేత్తలనూ వెంట తీసుకుని వచ్చారు. సోమవారం మధ్యాహ్నం మోడీతో ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొన్నారు. పలు అంశాలపై కీలకంగా చర్చించి సంతకాలు చేసుకున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.