యాప్నగరం

ఆ బోగీలు వాడి ఉంటే మరణాల సంఖ్య బాగా తగ్గేది

కాన్పూర్ సమీపంలో ఇండోర్ పాట్నా ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పిన ఘటనలో 125 మందికిపైగా ప్రయాణికులు మరణించారు.ఈ రైల్లోని పాత బోగీల స్థానంలో..

TNN 21 Nov 2016, 8:15 am
కాన్పూర్ సమీపంలో ఇండోర్ పాట్నా ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పిన ఘటనలో 125 మందికిపైగా ప్రయాణికులు మరణించారు. రెండు వేల కంటే ఎక్కువ మంది ప్రయాణికులతో గంటకు వంద కిలోమీటర్ల వేగంతో వెళ్తున్న ఈ రైలు ఆదివారం తెల్లవారుజామున 3:10 గంటలకు ప్రమాదానికి గురైంది. దీంతో 14 బోగీలు పట్టాలు తప్పాయి. ప్రయాణికులు నిద్ర మత్తులో ఉండటంతోపాటు పాత బోగీలు కావడంతో మరణాల సంఖ్య ఎక్కువగా ఉంది. ఎస్2, ఎస్3 బోగీలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. పట్టాలు విరిగిపోవడంతో ఈ ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు. 2010 మే తర్వాత దేశంలో జరిగిన అతిపెద్ద రైలు ప్రమాదం ఇదే. ఆరేళ్ల కిందట పశ్చిమ బెంగాల్లోని పశ్చిమ మిడ్నాపూర్లో జ్ఞానేశ్వరి ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పడంతో 148 మంది ప్రాణాలు కోల్పోయారు.
Samayam Telugu indore patna express derails worst rail accident in 6 years
ఆ బోగీలు వాడి ఉంటే మరణాల సంఖ్య బాగా తగ్గేది


కాన్పూర్ రైలు ప్రమాదం జరిగిన వెంటనే కాన్పూర్, ఝాన్సీ, ఆగ్రా, అలహాబాద్‌ల నుంచి మెడికల్, యాక్సిడెంట్ రిలీఫ్ రైళ్లు సంఘటనా స్థలికి చేరుకున్నాయి. ఎన్డీఆర్ఎఫ్ సహా రెస్క్యూ సిబ్బంది ప్రమాదం జరిగిన చోటుకు చేరుకుని భారీ సంఖ్యలో ప్రయాణికుల్ని కాపాడారు. సంఘటన జరిగిన వెంటనే స్థానికులు, పోలీసులు ప్రమాదం జరిగిన ప్రాంతానికి చేరుకుని ప్రయాణికుల్ని కాపాడే ప్రయత్నం చేశారు. ఎన్డీఆర్‌ఎఫ్ బలగాలు 56 మందిని ప్రాణాలతో కాపాడగలిగాయి.

ఇండోర్-పట్నా ఎక్స్‌ప్రెస్ శనివారం మధ్యాహ్నం రెండు గంటలకు ఇండోర్ నుంచి బయల్దేరింది. అర్ధరాత్రి దాటాక యూపీలోని ఒరాయ్ స్టేషన్‌లో రెండు నిమిషాలు ఆగింది. తెల్లవారుజామున 4 గంటలకు కాన్పూర్ చేరుకోవాలి. కానీ 3:10 గంటలకు పుఖ్రయా-మలాసా స్టేషన్ల మధ్య పట్టాలు తప్పింది. ఈ స్టేషన్ల మధ్యలో ఒకచోట పట్టా విరిగి పోవటంతో రైలు బోగీలు ఒకదానిలోకి మరొకటి చొచ్చుకెళ్లాయి. ఈ రైల్లోని పాత బోగీలకు బదులు శతాబ్ది రైళ్లకు వాడుతున్న అధునాతన లింకీ హాఫ్‌మెన్‌ బుష్‌ సిస్టమ్‌(ఎల్‌హెచ్‌బీ) కోచ్‌లను వాడి ఉంటే ఇలా ఒకదానిలోకి మరొకటి చొచ్చుకెళ్లేవి కావని, మరణాలు కూడా గణనీయంగా తగ్గేవని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.