యాప్నగరం

పీటర్‌కు విడాకులివ్వనున్న ఇంద్రాణి

షీనా బోరా హత్యకేసులో ప్రధాన నిందితురాలు ఇంద్రాణి ముఖర్జీ.

TNN 17 Jan 2017, 6:43 pm
షీనా బోరా హత్యకేసులో ప్రధాన నిందితురాలు ఇంద్రాణి ముఖర్జీ. కన్న కూతురిని ఆస్తి కోసం కసాయిలా మారి చంపేసింది. ప్రస్తుతం ముంబైలోని జైల్లో ఉంది. కాగా తాజాగా ఇంద్రాణి తన ప్రస్తుత భర్త పీటర్ ముఖర్జితో విడిపోవాలని అనుకుంటోంది. ఈ మేరకు కోర్టుకు ఈ విషయాన్ని తెలిపింది. తాను తన భర్త పీటర్‌కు విడాకులు ఇవ్వాలని కోరుకుంటున్నట్టు చెప్పింది. అందుకు అనుమతి ఇవ్వాల్సిందిగా కోరింది. కాగా కోర్టు అది మీ వ్యక్తిగత నిర్ణయమని, దానికి తమ అనుమతి అవసరం లేదని తెలిపింది.
Samayam Telugu indrani mukerjea says she wants to divorce peter mukerjea
పీటర్‌కు విడాకులివ్వనున్న ఇంద్రాణి


పీటర్ ముఖర్జీ కూడా షీనా బోరా హత్యకేసులో ముద్దాయే. అతను షీనా బోరా హత్య కేసులో తనను ఇరికించాడని ఇంద్రాణి భావిస్తోంది. అందుకే విడాకులు తీసుకోవాలని భావిస్తున్నట్టు సమాచారం. ఇంద్రాణికి మొదటి భర్త ద్వారా షీనా, మిఖాయిల్ పుట్టారు. అనంతరం ఆమె సంజీవ్ ఖన్నాను పెళ్లి చేసుకుంది. అతడికి కూడా విడాకులిచ్చి... పీటర్ ముఖర్జియాను పెళ్లి చేసుకుంది. రెండో భర్త సంజీవ్ ఖన్నా, డ్రైవర్ శ్యామ్ వర్ రాయ్ లతో కలిసి షీనాను 2012లో చంపేసింది. అందుకు ప్లాన్ వేసింది పీటర్ ముఖర్జియేనని సీబీఐ ఆరోపిస్తోంది.

పీటర్ కు మొదటి భార్య ద్వారా పుట్టిన కొడుకు రాహుల్ , షీనాల మధ్యే ప్రేమే హత్యకు దారితీసింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.