యాప్నగరం

అంతర్జాతీయ ప్రయాణాలకు గ్రీన్ సిగ్నల్.. నిబంధనలివే

అంతర్జాతీయ విమాన ప్రయాణాలకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రయాణికులకు మార్గదర్శకాలు విడుదల చేసింది.

Samayam Telugu 2 Aug 2020, 7:21 pm
అంతర్జాతీయ ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. ఆగస్టు 8 నుంచి అంతర్జాతీయ విమాన సేవలను పునరుద్ధరించనున్నట్లు ప్రకటించింది. ఇందుకు సంబంధించి కేంద్ర ఆరోగ్య శాఖ ఆదివారం (ఆగస్టు 2) సాయంత్రం కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇతర దేశాల నుంచి భారత్‌కు వచ్చే ప్రయాణికులందరూ తప్పనిసరిగా 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండాలని స్పష్టం చేసింది. మొదటి 7 రోజులు వారి సొంత ఖర్చులతో ప్రభుత్వం నిర్దేశించిన క్వారంటైన్ కేంద్రంలో, తదుపరి వారం రోజులు హోం క్వారంటైన్‌లో ఉండాలని తెలిపింది. ఈ మేరకు 72 గంటల ముందుగా www.newdelhiairport.in లో స్వీయ ధ్రువీకరణ పత్రం సమర్పించాలని తెలిపింది.
Samayam Telugu అంతర్జాతీయ విమాన ప్రయాణాలకు మార్గదర్శకాలు
International Travel


అంతర్జాతీయ ప్రయాణికులు కరోనా నిబంధనలు, మార్గదర్శకాలను తప్పక పాటించాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. గర్భిణిలు, పదేళ్ల లోపు పిల్లలు, వృద్ధులు, వివిధ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు, కుటుంబసభ్యులు, లేదా బంధువుల్లో ఎవరినైనా కోల్పోయిన వారికి 14 రోజుల హోమ్ క్వారంటైన్‌కు అనుమతిస్తామని తెలిపారు. ఇలాంటి ప్రత్యేక అవసరాలున్నవారి వివరాలను 72 గంటల ముందుగానే సమర్పించాలని స్పష్టం చేశారు.

Also Read: కరోనాతో కుక్క మృతి.. ప్రపంచంలో తొలి కేసు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.