యాప్నగరం

జులై 15 వరకు అంతర్జాతీయ విమానాలు రద్దు.. కేంద్రం కీలక ప్రకటన

Indian Aviation: కరోనా కేసులు పెరుగుతున్న వేళ కేంద్రం కీలక ప్రకటన చేసింది. జులై 15 వరకు అంతర్జాతీయ విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్లు డీజీసీఏ ప్రకటించింది.

Samayam Telugu 26 Jun 2020, 6:57 pm
అంతర్జాతీయ విమాన ప్రయాణాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. జులై 15 వరకు అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దు చేస్తున్నట్లు తెలిపింది. భారత్ నుంచి ఇతర దేశాలకు, విదేశాల నుంచి భారత్‌కు ఎలాంటి విమాన ప్రయాణాలు ఉండబోవని స్పష్టం చేసింది. శుక్రవారం (జూన్ 26) మధ్యాహ్నం డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
Samayam Telugu అంతర్జాతీయ విమానాలు
International Flights


దేశంలో కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే సాధారణ ప్రయాణికుల రైళ్ల సర్వీసులను ఆగస్టు 12 వరకు రద్దు చేసిన విషయం తెలిసిందే. తాజాగా అంతర్జాతీయ విమాన సర్వీసుల రద్దు గడువును పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే.. ఈ షరతులు అంతర్జాతీయ కార్గో విమానాలకు, కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో నడిపే విమానాలకు వర్తించవని స్పష్టం చేసింది. దేశీయ విమాన సర్వీసుల్లో మాత్రం ఎలాంటి మార్పు లేదని తెలిపింది.

కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా మార్చి 23 నుంచే అంతర్జాతీయ విమాన సర్వీసులను డీజీసీఏ నిలిపివేసింది. అయితే.. లాక్‌డౌన్ సడలింపుల్లో భాగంగా మే 25 నుంచి దేశీయ విమాన సర్వీసులకు అనుమతి ఇచ్చింది. అంతర్జాతీయ సర్వీసులపై ఆంక్షలు కొనసాగించింది. త్వరలో అంతర్జాతీయ విమానాలు కూడా ప్రారంభమవుతాయని వార్తలు వెలువడుతున్న వేళ కేంద్రం ఈ ప్రకటన చేయడం గమనార్హం. మరోవైపు.. విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను ‘వందే భారత్ మిషన్’ ద్వారా స్వదేశానికి తరలించే ప్రక్రియ కొనసాగుతోంది.

Also Read: సరిహద్దులో వంతెనను మూసేసిన నేపాల్
Must Read: స్విస్ బ్యాంకులో భారీగా తగ్గిన భారతీయుల నగదు నిల్వలు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.