యాప్నగరం

త్వరలో విదేశాలకూ విమాన సర్వీసులు ప్రారంభం

జులైలో అంతర్జాతీయ విమాన సర్వీసులను పున:ప్రారంభిస్తామని విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి తెలిపారు. తేదీలను ప్రకటిస్తామని చెప్పారు.

Samayam Telugu 17 Jun 2020, 12:24 am
లాక్‌డౌన్‌తో నిలిచిపోయిన అంతర్జాతీయ విమాన సేవలను పునఃప్రారంభించేందుకు కేంద్రం కసరత్తు చేస్తోంది. జులైలో అంతర్జాతీయ విమాన సర్వీసులను ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్‌ సింగ్ పూరి మంగళవారం (జూన్ 16) వెల్లడించారు. అంతర్జాతీయ విమానాలను ప్రారంభించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని.. కానీ, కచ్చితమైన తేదీని ఇప్పుడే ప్రకటించలేమని ఆయన తెలిపారు. ఇందుకు వాటాదారులు, ప్రయాణికులకు నమ్మకం కలిగించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.
Samayam Telugu హర్దీప్ సింగ్ పూరి
Hardeep Singh Puri


లాక్‌డౌన్ సడలింపుల్లో భాగంగా ఇప్పటికే దేశీయ విమాన సర్వీసులను ప్రారంభించిన విషయం తెలిసిందే. మే 25 నుంచి జూన్‌ 15వ తేదీ వరకు 1,35,954 మంది ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేర్చినట్లు మంత్రి హర్దీప్ సింగ్ పూరి మంగళవారం ఉదయం ఓ ప్రకటనలో తెలిపారు. ఇందు కోసం 1464 విమాన సర్వీసులను వినియోగించినట్లు వెల్లడించారు. మరోవైపు.. విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను వందే భారత్ మిషన్‌లో భాగంగా స్వదేశానికి తీసుకువచ్చే ప్రక్రియ కొనసాగుతోంది.

Also Read: లాక్‌డౌన్ తర్వాత ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటోంది: మోదీ

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.