యాప్నగరం

మద్యం మత్తులో పోలీసు స్టేషన్‌కొచ్చి రచ్చరచ్చ చేసిన మహిళ

మద్యం మత్తులో వున్న ఓ మహిళ, పోలీసు స్టేషన్‌కి వచ్చి వీరంగం సృష్టించిన ఘటన ఇది...

TNN 26 Oct 2016, 7:41 pm
మద్యం మత్తులో వున్న ఓ మహిళ, మహిళా పోలీసు స్టేషన్‌కి వచ్చి వీరంగం సృష్టించిన ఘటన ఇది. ఉత్తర్ ప్రదేశ్‌లోని అలహాబాద్‌కి చెందిన సివిల్ లైన్స్ ఏరియా మహిళా పోలీసు స్టేషన్‌లో మంగళవారం చోటుచేసుకుందీ ఘటన. స్టేషన్‌కి వచ్చీ రావడంతోనే అక్కడి సిబ్బందిపై తన ప్రతాపం చూపించడం మొదలు పెట్టిన ఆ మహిళ ఎవరు, ఏం చెప్పినా వినిపించుకోలేదు.
Samayam Telugu intoxicated woman creates ruckus at women police station
మద్యం మత్తులో పోలీసు స్టేషన్‌కొచ్చి రచ్చరచ్చ చేసిన మహిళ


చివరకు ఓ మహిళా పోలీసు కానిస్టేబుల్ ఆమెని అతి కష్టంమీద కంట్రోల్ చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకురాగలిగారు. అప్పటికే మద్యం మత్తులో వున్న ఆమెని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. వైద్య పరీక్షల రిపోర్టుల ఆధారంగా ఆమెపై విచారణ చేపట్టిన అనంతరం చర్యలు తీసుకోనున్నట్టు సంబంధిత స్టేషన్ హౌజ్ ఆఫీసర్ తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.