యాప్నగరం

ఐఎన్‌ఎక్స్ కేసు: మాజీ మంత్రి చిదంబరానికి సీబీఐ సమన్లు

కేంద్ర మాజీ మంత్రి పి చిదంబరానికి సీబీఐ సమన్లు జారీ చేసింది. ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో ఆయణ్ని ప్రశ్నించనుంది. జూన్‌ 6న విచారణకు హాజరు కావల్సిందిగా చిదంబరంను దర్యాప్తు సంస్థ కోరింది.

TNN 1 Jun 2018, 7:51 pm
కేంద్ర మాజీ మంత్రి పి చిదంబరానికి సీబీఐ సమన్లు జారీ చేసింది. ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో ఆయణ్ని ప్రశ్నించనుంది. జూన్‌ 6న విచారణకు హాజరు కావల్సిందిగా చిదంబరంను దర్యాప్తు సంస్థ కోరింది. ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరం అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ కేసులో కార్తి చిదంబరంను ఫిబ్రవరి 28న అరెస్ట్‌ చేశారు. అనంతరం ఆయన బెయిల్‌పై విడుదలయ్యారు.
Samayam Telugu P chidambaram


2007లో కేంద్ర ఆర్థిక మంత్రిగా ఉన్న చిదంబరం ఐఎన్‌ఎక్స్‌ మీడియాలో విదేశీ పెట్టుబడులకు ఆమోదం లభించేలా ప్రభావితం చేశారని ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో చిదంబరం పాత్రపై ప్రశ్నించడానికి సీబీఐ తాజాగా సమన్లు జారీ చేసింది. అయితే.. ఎయిర్‌సెల్‌ మ్యాక్సిస్‌, ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసుల్లో అరెస్ట్‌ నుంచి తప్పించుకోవడానికి చిదంబరం బుధవారమే ఢిల్లీలో రెండు న్యాయస్థానాలను ఆశ్రయించారు. జూన్‌ 5న తదుపరి విచారణ జరిగే వరకూ చిదంబరంను అరెస్ట్‌ చేయరాదని వీటిలో ఓ న్యాయస్థానం దర్యాప్తు సంస్థ ఈడీని ఆదేశించింది. అవినీతి కేసులో చిదంబరంను జులై 3 వరకూ అరెస్ట్‌ చేయరాదని మరో కోర్టు సీబీఐకి సూచించింది.

ఐఎన్‌ఎక్స్ సంస్థకు విదేశీ పెట్టుబడుల కోసం విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక మండలి ఆమోదం లభించేలా సహకరించారని కార్తీ చిదంబరంపై ఆరోపణలున్నాయి. ఇందుకోసం ఆయన ముడుపులు తీసుకున్నారని ప్రధాన ఆరోపణ.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.