కశ్మీర్లో ఓ ఐపీఎస్ అధికారి సోదరుడు ఉగ్రవాద సంస్థలో చేరాడు. కశ్మీర్ యూనివర్సిటీ క్యాంపస్ నుంచి మే 22న అదృశ్యమైన అతడు తమ సంస్థలో చేరినట్లు హిజ్బుల్ ముజాహిదీన్ ప్రకటించింది. కశ్మీర్ వర్సిటీ, జకురా క్యాంపస్లో బ్యాచిలర్ ఆఫ్ యునానీ మెడిసిన్ అండ్ సర్జరీలో డిగ్రీ చేస్తున్న షామ్సుల్ హక్ మెంగ్నూ మే 22 నుంచి అదృశ్యమయ్యాడు. తమ కుమారుడు కనిపించడం లేదంటూ అతడి తల్లిదండ్రులు మే 25న పోలీసులకు ఫిర్యాదు చేశారు. షామ్సుల్ సోదరుడు ఇనాముల్ హక్ ఓ ఐపీఎస్ అధికారి కావడం గమనార్హం.
ఉగ్రవాది బుర్హాన్ వనీ రెండో వర్థంతి సందర్భంగా ఆదివారం (జులై 8) హిజ్బుల్ ముజాహిదీన్.. తమ సంస్థలో కొత్తగా చేరిన 18 మంది యువకుల ఫొటోలను విడుదల చేసింది. వీరిలో షామ్సుల్ హక్ ఒకడు. హిజ్బుల్ విడుదల చేసిన ఫొటోల్లో షామ్సుల్ ఓ తుపాకీ పట్టుకొని ఉన్నాడు. ఆ ఫొటోపై ‘బుర్హాన్ సనీ’ అని రాసి ఉండటం గమనార్హం. దక్షిణ కశ్మీర్లోని సోపియాన్ జిల్లాలో ఓ మారుమూల గ్రామానికి చెందిన షామ్సుల్ ఉన్నత విద్య చదువుతూనే మిలిటెన్సీ పట్ల ఆకర్షితుడయ్యాడు.
ఆ వైపుగా విద్యాధికులే అధికం..
ఇదిలాఉండగా.. గత రెండేళ్లుగా ఉగ్రవాద సంస్థల్లో చేరుతున్న కశ్మీరీ యువకుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఈ ఏడాది ఇప్పటివరకూ 50 మంది యువకులు వివిధ ఉగ్రవాద సంస్థల్లో చేరారు. వీరిలో అత్యధికులు విద్యాధికులే కావడం మరింత ఆందోళన కలిగించే అంశం. పోలీసు అధికారులు కూడా ఉగ్రవాదం పట్ల ఆకర్షితులవడం కలవరపెట్టే అంశం.
చివరికి పోలీసు అధికారులు కూడా..
పుల్వామకు చెందిన పోలీస్ అధికారి ఇర్ఫాన్ రషీద్ దార్ కూడా తమ సంస్థలో చేరినట్లు హిజ్బుల్ ప్రకటించింది. ఇతడి ఆచూకీ గత కొన్ని రోజులుగా కనిపించడంలేదు. హిజ్బుల్ సంస్థ మిలిటెంట్ల ఫొటోలను విడుదల చేసిన ఉదంతంపై స్పందించడానికి పోలీసు అధికారులు నిరాకరించారు. కేవలం సంచలనం కోసమే హిజ్బుల్ ఈ జాబితా విడుదల చేసిందని కొంత మంది పోలీస్ అధికారులు కొట్టిపారేస్తున్నారు.
ఉగ్రవాది బుర్హాన్ వనీ రెండో వర్థంతి సందర్భంగా ఆదివారం (జులై 8) హిజ్బుల్ ముజాహిదీన్.. తమ సంస్థలో కొత్తగా చేరిన 18 మంది యువకుల ఫొటోలను విడుదల చేసింది. వీరిలో షామ్సుల్ హక్ ఒకడు. హిజ్బుల్ విడుదల చేసిన ఫొటోల్లో షామ్సుల్ ఓ తుపాకీ పట్టుకొని ఉన్నాడు. ఆ ఫొటోపై ‘బుర్హాన్ సనీ’ అని రాసి ఉండటం గమనార్హం. దక్షిణ కశ్మీర్లోని సోపియాన్ జిల్లాలో ఓ మారుమూల గ్రామానికి చెందిన షామ్సుల్ ఉన్నత విద్య చదువుతూనే మిలిటెన్సీ పట్ల ఆకర్షితుడయ్యాడు.
ఆ వైపుగా విద్యాధికులే అధికం..
ఇదిలాఉండగా.. గత రెండేళ్లుగా ఉగ్రవాద సంస్థల్లో చేరుతున్న కశ్మీరీ యువకుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఈ ఏడాది ఇప్పటివరకూ 50 మంది యువకులు వివిధ ఉగ్రవాద సంస్థల్లో చేరారు. వీరిలో అత్యధికులు విద్యాధికులే కావడం మరింత ఆందోళన కలిగించే అంశం. పోలీసు అధికారులు కూడా ఉగ్రవాదం పట్ల ఆకర్షితులవడం కలవరపెట్టే అంశం.
చివరికి పోలీసు అధికారులు కూడా..
పుల్వామకు చెందిన పోలీస్ అధికారి ఇర్ఫాన్ రషీద్ దార్ కూడా తమ సంస్థలో చేరినట్లు హిజ్బుల్ ప్రకటించింది. ఇతడి ఆచూకీ గత కొన్ని రోజులుగా కనిపించడంలేదు. హిజ్బుల్ సంస్థ మిలిటెంట్ల ఫొటోలను విడుదల చేసిన ఉదంతంపై స్పందించడానికి పోలీసు అధికారులు నిరాకరించారు. కేవలం సంచలనం కోసమే హిజ్బుల్ ఈ జాబితా విడుదల చేసిందని కొంత మంది పోలీస్ అధికారులు కొట్టిపారేస్తున్నారు.