యాప్నగరం

ఏప్రిల్ 30 వరకు ఐఆర్‌సీటీసీ రైల్వే బుకింగ్ రద్దు

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో ఐఆర్‌సీటీసీ కీలక నిర్ణయం తీసుకుంది. తన ఆధ్వర్యంలో నడుస్తోన్న మూడు ప్రయివేట్ రైళ్ల బుకింగ్‌లను ఏప్రిల్ 30 వరకు రద్దు చేసింది.

Samayam Telugu 7 Apr 2020, 8:05 pm
కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో.. తన ఆధ్వర్యంలో నడిపే మూడు ప్రయివేట్ రైళ్ల బుకింగ్‌లను ఏప్రిల్ 30 వరకు రద్దు చేస్తూ ఐఆర్‌సీటీసీ నిర్ణయం తీసుకుంది. ఇంతకు ముందు లాక్‌డౌన్ ముగిసే వరకు ఐఆర్‌సీటీసీ ఈ రైళ్ల బుకింగ్‌లను సస్పెండ్ చేసింది. ఈ రైళ్లలో టికెట్లు బుకింగ్ చేసుకున్న ప్రయాణికులకు పూర్తి మొత్తాన్ని రీఫండ్ చేస్తామని తెలిపింది.
Samayam Telugu train


ప్రస్తుతం ఐఆర్‌సీటీసీ తేజస్ రైళ్ల పేరిట అత్యంత రద్దీగా ఉండే రెండు మార్గాల్లో ప్రయివేట్ రైళ్లను నడుపుతోంది. వీటిలో ఢిల్లీ-లక్నో మార్గం ఒకటి కాగా.. మరొకటి అహ్మదాబాద్- ముంబై మార్గం. కాశీ మహాకాళ్ పేరిట మరో ప్రయివేట్ రైలును ఐఆర్‌సీటీసీ నడుపుతోంది.

దేశంలో లాక్‌డౌన్ పొడిగించే అవకాశం ఉందని వార్తలు వెలువడుతున్న తరుణంలో ఐఆర్‌సీటీసీ ఈ తరహా నిర్ణయం తీసుకోవడం గమనార్హం. రైల్వే శాఖ ఆధ్వర్యంలో నడిచే రైళ్లకు కూడా ఏప్రిల్ చివరి వరకు టికెట్ల బుకింగ్ రద్దు చేసే అవకాశం ఉంది. ఒక వేళ లాక్‌డౌన్‌ను ఎత్తివేసినా.. పూర్తి స్థాయిలో రైళ్లను వెంటనే పునరుద్ధరించే అవకాశం కనిపించడం లేదు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.