యాప్నగరం

ఇలాంటి మరణం సినిమాల్లోనూ చూసుండరు.. రైలు విండో సీట్లో దురదృష్టం

Delhi Train: రైల్లో విండో సీట్లో కూర్చున్న ఓ ప్రయాణికుడి ప్రాణాలు ఊహించని విధంగా గాల్లో కలిశాయి. అప్పటిదాకా తోటి ప్రయాణికులతో కబుర్లు చెప్పుకుంటూ ప్రయాణిస్తున్న వ్యక్తి ఆకస్మికంగా మృతి చెందాడు. కిటికీ అద్దాలను బద్దలు కొట్టుకుంటూ దూసుకొచ్చిన ఓ ఇనుపకడ్డీ అతడి మెడలో గుచ్చుకుంది. ఢిల్లీ నుంచి కాన్పూర్ వెళ్తున్న నీలాంచల్ ఎక్స్‌ప్రెస్ రైల్లో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాద ఘటనతో తోటి ప్రయాణికులు దిగ్భ్రాంతికి గురయ్యారు.

Authored byశ్రీనివాస్ గంగం | Samayam Telugu 5 Dec 2022, 8:27 pm
మృత్యువు ఎప్పుడు, ఏ వైపు నుంచి దూసుకొస్తుందో ఎవరూ ఊహించలేరు. అప్పటివరకూ ఆనందంగా జర్నీ చేస్తున్నవారు అకస్మాత్తుగా యాక్సిడెంట్‌కు గురై ప్రాణాలు విడిచిన దుర్ఘటనల గురించి అనేకం వినుంటారు. కానీ, దేశ రాజధాని ఢిల్లీలో చోటు చేసుకున్న ఈ ప్రమాదం మాత్రం ఎవరి ఊహకూ అందదు. ఢిల్లీ నుంచి కాన్పూర్ వెళ్తున్న నీలాంచల్ ఎక్స్‌ప్రెస్ రైల్లో హరికేశ్ కుమార్ దూబే అనే వ్యక్తి విండో సీటు పక్కన కూర్చున్నాడు. తోటి ప్రయాణికులతో సరదాగా కబుర్లు చెప్పుకుంటూ తన ప్రయాణం కొనసాగిస్తున్నాడు. సమయం ఉదయం 8.45 గంటలు. చలి కారణంగా కిటికీ గ్లాస్‌ కిందికి దించే ఉంది. రైలు వేగంగా వెళ్తోంది. ఇంతలో ఎక్కడ నుంచి దూసుకొచ్చిందో తెలియదు.. ఓ ఇనుప కడ్డీ ఆ కిటికీ అద్దాలను పగులగొట్టుకుంటూ వచ్చి హరికేశ్ మెడలో గుచ్చుకుంది. అతడి కళ్లలోంచి కూడా రక్తపు ధారలు బయటకి వచ్చాయి.
Samayam Telugu Representative Image
ప్రతీకాత్మక చిత్రం


ఎదురుగా ఉన్నవారు ఏం జరిగిందో తెలుసుకునే లోపలే హరికేశ్ ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఒళ్లు గగుర్పొడిచే ఈ ఘటనకు సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఢిల్లీ సమీపంలోని రైల్లో దన్వార్, సోమ్నా స్టేషన్ల మధ్య శుక్రవారం (డిసెంబర్ 2) ఉదయం 8.45 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

సీట్లో కూర్చున్న వ్యక్తి కూర్చున్నట్టుగానే..


రైలు కిటికీని చేధించుకుంటూ దూసుకొచ్చిన ఐరన్ రాడ్.. హరికేశ్ కుమార్ మెడను చిధ్రం చేసి, క్షణాల్లో అతడి ప్రాణాలు తీసింది. ఇంతకుముందు ఇంగ్లిష్ సినిమా ‘ఫైనల్ డెస్టిడేషన్’ సిరీస్‌లోనే ఇలాంటి షాకింగ్ మృత్యు ఘటనలు చూసుండవచ్చు..!

‘కొన్ని చోట్ల ట్రాక్‌ను సరిచేసేందుకు ఉపయోగించే ఇనుపకడ్డీ బోగీలోకి దూసుకొచ్చింది. ఘటనపై దర్యాప్తు చేస్తున్నాం’ అని రైల్వే అధికారులు తెలిపారు.


కోచ్‌లోని ప్రయాణికులు అందించిన సమాచారం మేరకు రైల్వే సిబ్బంది అలీగఢ్‌ జంక్షన్‌లో రైలును ఆపించారు. మృతదేహాన్ని రైల్వే పోలీసులకు అప్పగించారు.

Tirupati: ఆ యువతిది ఆత్మహత్య కాదు, హత్య.. 5 నెలల తర్వాత వెలుగులోకి, ఏం జరిగింది?
స్కూల్ బ్యాగుల్లో గర్భనిరోధక మాత్రలు, ఇంకా.. ఛీ పాడు! చెక్ చేసి షాకైన టీచర్లు
పిల్లలు అతిగా TV చూస్తున్నారా? ఈ తల్లి ఏం చేసిందో చూశారా..?!
Read Latest National News and Telugu News
రచయిత గురించి
శ్రీనివాస్ గంగం
శ్రీనివాస్ రెడ్డి గంగం సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ అంశాలపై వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. EJS నుంచి శిక్షణ పొందిన శ్రీనివాస్‌కు జర్నలిజంలో 12 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. JNTU నుంచి BTech చేశారు. గతంలో ప్రముఖ పత్రికల్లో వార్తలు, విద్యా సంబంధిత అంశాలు అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.