యాప్నగరం

అంబానీ ఇంట వైభవంగా ఈశా-ఆనంద్‌ల పెళ్లి..!

దేశంలోనే ఖరీదైన వివాహంగా ప్రచారం జరుగుతున్న ఈ పెళ్లికి దాదాపు రూ. 700 కోట్ల వరకూ అంబానీ కుటుంబం ఖర్చు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Samayam Telugu 12 Dec 2018, 11:13 pm
అంబానీ ఇంట పెళ్లిబాజాలు మోగాయి. ముంబయిలోని పెడ్డార్‌ రెడ్‌లో ఉన్న విలాసవంతమైన అంబానీ ఇల్లు ‘యాంటీలా’‌లో ముకేశ్ అంబానీ గారాల పట్టి ఈశా వివాహం అంగరంగ వైభవంగా ఈరోజు జరిగింది. ఇటీవల ఉదయ్‌పూర్‌లో జరిగిన ఈశా-ఆనంద్‌ల ముందస్తు వివాహా వేడుకలకి పెద్ద సంఖ్యలో ప్రముఖులు హాజరవడంతో పాటు.. అక్కడ సంగీత్‌లో డ్యాన్స్‌‌ చేసి అలరించిన విషయం తెలిసిందే.
Samayam Telugu 700


ఈరోజు వివాహ వేడుక‌‌లకి కూడా బాలీవుడ్, క్రీడ, రాజకీయ ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. బిగ్‌బి అమితాబ్ బచ్చన్, అమీర్‌ఖాన్, రజనీకాంత్, సైఫ్ అలీఖాన్, కరీనా కపూర్, సోనమ్‌ కపూర్, కిరణ్ రావ్, ప్రియాంక చోప్రా, నిక్‌ జోనస్ తదితరులు వివాహ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వీరితో పాటు మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఏపీ సీఎం చంద్రబాబు కూడా ఈ పెళ్లి‌కి హాజరవగా.. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, హర్భజన్ సింగ్ ఫ్యామిలీతో కలిసి వచ్చారు.

అంబానీ ఇంట పెళ్లి వేడుక.. సెలబ్రిటీల సందడి.. ఫొటో గ్యాలరీ కోసం క్లిక్ చేయండి..!!


దేశంలోనే ఖరీదైన వివాహంగా ప్రచారం జరుగుతున్న ఈ పెళ్లికి దాదాపు రూ. 700 కోట్ల వరకూ అంబానీ కుటుంబం ఖర్చు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. 27 అంతస్తులన్న యాంటిలా భవనంలో ఈ వివాహం జరుగుతుండటంతో.. అతిథుల సంఖ్య కూడా.. 500 మంది‌కి పైనే ఉన్నట్లు సమాచారం.


తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.