ఇష్రత్ జహాన్ ఎన్ కౌంటర్ వివాదంలో బీజేపీని ఇరుకున పెట్టేందుకు యత్నిస్తున్న కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు అదే అంశం చిక్కులు తెచ్చిపెట్టేలా కనిపిస్తోంది. ఒకప్పుడు యూపీఏ ప్రభుత్వంలో సంయుక్త కార్యదర్శిగా పనిచేసిన అధికారి ఎ.కె.జైన్ బుధవారం నాడు చేసిన ప్రకటనే ఇందుకు కారణం. ఇష్రత్ కు ఆమె బృందానికి తీవ్రవాదులతో సంబంధాలున్నాయనేందుకు ఎటువంటి సందేహం అక్కరలేదని ఆయన కుండబద్దలు కొట్టారు. దేశంలో ప్రముఖులను హతమార్చేందుకు ఆమె బృందం ప్రణాళిక రచించిన మాట వాస్తవమేనని ఆయన చెప్పారు. నరేంద్రమోడీ నేతృత్వంలోని అప్పటి గుజరాత్ ప్రభుత్వానికి మన్మోహన్ ప్రభుత్వానికి మధ్య పరస్పర అనుమానాలుండేవని చెప్పారు. ఆమె గురించి గతంలో ఇంటెలిజెన్స్ బ్యూరో సమర్పించిన నివేదిక ఏమాత్రం సత్యదూరం కాదని అందులో అన్నీ వాస్తవాలే ఉన్నాయని ఎఎన్ఐ వార్తా సంస్థకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో స్పష్టం చేసారు. కేంద్రంలో సంయుక్త కార్యదర్శి హోదాలో జైన్, దేశంలోని మత పరమైన అంశాల మానిటరింగ్ ఇన్చార్జిగా అప్పట్లో వ్యవహరించారు.
ఇష్రత్ టెర్రర్ లింక్స్ వాస్తవమేనన్న మాజీ అధికారి
ఇష్రత్ జహాన్ ఎన్ కౌంటర్ వివాదంలో బీజేపీని ఇరుకున పెట్టేందుకు యత్నిస్తున్న కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు అదే అంశం చిక్కులు తెచ్చిపెట్టేలా కనిపిస్తోంది
TNN 3 Mar 2016, 5:35 pm