యాప్నగరం

కాశ్మీర్‌లో సంఘ విద్రోహ శక్తులకి ఐఎస్ఐ నిధులు

కాశ్మీర్‌లో భారత సైన్యంపై రాళ్లు విసురుతూ, సైన్యంపైనే దాడులకి పాల్పడుతున్న యువతకి, అక్కడి సంఘ విద్రోహ శక్తులకి...

TNN & Agencies 6 May 2017, 11:33 pm
కాశ్మీర్‌లో భారత సైన్యంపై రాళ్లు విసురుతూ, సైన్యంపైనే దాడులకి పాల్పడుతున్న యువతకి, అక్కడి సంఘ విద్రోహ శక్తులకి పాకిస్థాన్ నుంచి ఐఎస్ఐ ఏ విధంగా నిధులు సరఫరా చేస్తుందో బట్టబయలైంది. హురియత్ నేత షబీర్ షా ద్వారా కాశ్మీర్‌లోని అరాచక శక్తులకి రూ.70 లక్షలు చేరవేసిన వైనాన్ని తెలిపే వీడియోను టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూప్‌కి చెందిన టైమ్స్ నౌ ఛానెల్ ప్రసారం చేసింది.
Samayam Telugu isi funding stone pelters in kashmir exposed
కాశ్మీర్‌లో సంఘ విద్రోహ శక్తులకి ఐఎస్ఐ నిధులు


పాకిస్థాన్ కోసం పనిచేసిన ఉగ్రవాది బురాన్ వని మృతి తర్వాత కాశ్మీర్‌లో సైన్యంపై రాళ్లు విసిరే ఘటనలు అధికమయ్యాయి. సైన్యంపై రాళ్లదాడులకి పాల్పడుతున్న వారి సంఖ్య సైతం అధికమైంది. అయితే, ఈ అరాచక శక్తుల వెనుక పాక్ వుందన్న ఆరోపణలు ఇవాళ కొత్తవి కాదు. కానీ అందుకు సంబంధించిన ఆధారాలు లభ్యమవడమే ప్రస్తుతం చర్చనియాంశమైంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.