యాప్నగరం

Maharashtra: వ్యాపారి ఇంట్లో డబ్బే డబ్బు... రూ.56 కోట్ల నగదు.. బంగారం, వజ్రాలు సీజ్

మహారాష్ట్రలో (Maharashtra) ఓ వ్యాపారి ఇంట్లో ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. 8 రోజుల పాటు సాగిన తనిఖీల్లో కళ్లు చెదిరే ఆస్తులు, డబ్బు, బంగారం, వజ్రాలు, ముత్యాలు బయటపడ్డాయి. మొత్తం రూ.360 కోట్ల విలువ చేసే ఆస్తులు, నగదు దొరికాయి. వాటిని మెషిన్స్ సాయంతో లెక్కించేందుకు 13 గంటల సమయం పట్టింది. వాటితో పాటు ఇతర ఆస్తులకు సంబంధించిన కీలక డాక్యుమెంట్లను, డిజిటల్ డేటాను కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

Authored byAndaluri Veni | Samayam Telugu 11 Aug 2022, 2:34 pm

ప్రధానాంశాలు:

  • వ్యాపారి ఇంట్లో సోదాలు
  • 8 రోజుల పాటు తనిఖీలు
  • 13 గంటలపాటు డబ్బు లెక్కింపు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu it raids in maharashtra
మహారాష్ట్రలో (Maharashtra) ఓ వ్యాపారి ఇంట్లో ఆదాయ పన్ను శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. కళ్లు చెదిరేలా కట్టకట్టలుగా డబ్బు.. బంగారం బయటపడ్డాయి. పన్నుఎగవేత ఆరోపణలు రావడంతో జన్నాలోని ఓ వ్యాపారి ఇళ్లు, ఆఫీసుల్లో ఆదాయ పన్ను శాఖ సోదాలు నిర్వహించింది. ఆ తనిఖీల్లో అధికారులు రూ.56 కోట్ల నగదు, రూ.14 కోట్ల విలువైన బంగారం, వజ్రాభరణాలను గుర్తించారు. మొత్తం 32 కిలోల బంగారం, ముత్యాలు, వజ్రాలు కూడా ఉన్నాయి. వాటితో పాటు ఇతర ఆస్తులకు సంబంధించిన కీలక డాక్యుమెంట్లను, డిజిటల్ డేటాను కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
స్టీల్, వస్త్ర, స్థిరాస్థి వ్యాపారాలు చేసే ఓ సంస్థకు సంబంధించిన వ్యాపారవేత్త ఇంట్లో, ఆఫీసులో ఎనిమిది రోజుల పాటు సోదాలు చేశారు. అంటే ఆగస్ట్ ఒకటో తేదీ నుంచి 8వ తేదీ వరకు నిరంతరాయంగా తనిఖీుల చేశారు. మొత్తంగా రూ.360 కోట్ల విలువ చేసే ఆస్తులను గుర్తించారు. అధికారులు స్వాధీనం చేసుకున్న నగదును యంత్రాల సాయంతో లెక్కించేందుకు 13 గంటలు పట్టింది. ఈ ఆపరేషన్‌లో 25 సంచుల్లో నోట్ల కట్టలను ప్యాక్ చేశారు. తర్వాత ఈ మొత్తాన్ని స్థానిక స్టేట్ బ్యాంకుకు తీసుకెళ్లి లెక్కించారు.

పన్ను ఎగవేతలకు పాల్పడినట్టు ఆరోపణలు వచ్చిన తర్వాత ఆదాయపు పన్ను శాఖ రాష్ట్రవ్యాప్తంగా 260 మంది అధికారులతో కూడిన ఐదు టీమ్‌లను సెర్చ్ ఆపరేషన్ కోసం ఏర్పాటు చేసింది. ఈ ఆపరేషన్‌లో 120కి పైగా వాహనాలను వినియోగించినట్టు అధికారులు వెల్లడించారు. కాగా టీచర్ రిక్రూట్‌మెంట్ స్కామ్‌లో పశ్చిమ బెంగాల్‌లో అధికారులు, రాజకీయ నాయకులు, వారి సన్నిహితుల ఇళ్లలో తనిఖీలు నిర్వహించారు. ఆ సోదాల్లో అర్పిత ముఖర్జీ ఇంట్లో గుట్టలు గుట్టలుగా డబ్బు బయటపడింది. ఆ డబ్బంతా ఆ రాష్ట్ర మాజీ మంత్రి పార్థ ఛటర్జీవని చెప్పడంతో అతనిని, అర్జిత ముఖర్జీని పోలీసులు అరెస్ట్ చేశారు.

Read Also:వికలాంగ వ్యక్తిపై దాడి... కర్రతో బెదిరించి.. కాళ్లను నొక్కించి...

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.