యాప్నగరం

ఐటీ: మరో రెండేళ్ల పాటూ ‘పింక్ స్లిప్’ల పర్వమే

ఐటీ ఉద్యోగులను భారీగా విధుల్లోంచి తొలగిస్తున్నాయి కంపెనీలు.

TNN 15 May 2017, 7:47 am
Samayam Telugu it industry layoffs may continue up to 2 yrs says experts
ఐటీ: మరో రెండేళ్ల పాటూ ‘పింక్ స్లిప్’ల పర్వమే
మన దేశంలో ఐటీ పరిశ్రమ సంక్షోభంలో పడుతోంది. ఐటీ ఉద్యోగులను భారీగా విధుల్లోంచి తొలగిస్తున్నాయి కంపెనీలు. ఎప్పుడు ఎవరికీ పింక్ స్లిప్ లు స్వాగతం చెబుతాయో తెలియక ఉద్యోగులు వణుకుతున్నారు. ఈ పరిస్థితి ఇంకా రెండేళ్ల పాటూ కొనసాగే అవకాశం ఉన్నట్టు నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే ఇన్ఫోసిస్, టెక్ మహీంద్ర, కాగ్నిజెంట్, విప్రో, టీసీఎస్ లాంటి బహుళజాతి సంస్థలు వేల మంది ఉద్యోగులను తొలగించాయి. ఈ ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. పనితీరు మెరుగుపరుచుకోని ఉద్యోగులకు, భారీ స్థాయిలో జీతాలు తీసుకుంటున్నవారికి మొదట పింక్ స్లిప్ లు చేరుతున్నాయి. ఆటోమేషన్, నిర్వహణ ఖర్చులు తగ్గించుకునేందుకు ఐటీ సంస్థలు ఇలా చేస్తున్నాయి. అలాగే డిజిటలైజేషన్, యాంత్రీకరణ కూడా కారణమే.

మరో రెండేళ్ల పాలూ ఈ పరిస్థితే కొనసాగే అవకాశం ఉందని అంటున్నారు నిపుణులు. ఈ రెండేళ్లలో కనీసం లక్ష ఉద్యోగాలకు కోత పడుతుందంటున్నారు. మరికొందరు నిపుణులు మాట్లాడుతూ మరో మూడేళ్ల పాటూ ఐటీ సెక్టార్ కుదురుకోవడం కష్టమని... ఈ మూడేళ్లలో రెండు లక్షల దాకా ఉద్యోగాలకు కోత పడే అవకాశం ఉందని అంటున్నారు. ఈ ఏడాది 56వేల మందికి ఉద్యోగాలు పోయే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

అమెరికా వంటి దేశాల్లో మారిన వీసా నిబంధనలు కూడా ఈ మార్పుకు ప్రధాన కారణంగానే చెప్పుకోవాలి. ఆయా దేశాల్లో స్థానికులకే ఉద్యోగాలు కల్పించాడానికి వీలుగా విధానాలు మారిన క్రమంలోనే దేశీయ ఐటీ కంపెనీలు మదింపు ప్రక్రియ చేపట్టాయి. అమెరికా, సింగపూర్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వంటి దేశాల్లో స్థానికులకే ఉద్యోగాలు రావాలన్న నిర్ణయంతో వీసా నిబంధనలను కఠినతరం చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.