యాప్నగరం

Jammu and Kashmir: సహోద్యోగులపై కాల్పులు జరిపి... తనను తాను కాల్చుకున్న జవాన్

జమ్మూకశ్మీర్‌లో ఓ జవాన్ తోటి ఉద్యోగులపై కాల్పులు జరిపి.. తర్వాత తనను తాను కాల్చుకున్నాడు. దాంతో వెంటనే ప్రాణాలు కోల్పోయాడు. భూపేంద్ర సింగ్​ అనే జవాన్ ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. అయితే కాల్పుల్లో గాయపడిన వారు ప్రస్తుతం ఆస్పత్రిలో ఉన్నారు. వారికి ఎలాంటి ప్రాణాపాయం లేదని అధికారులు వెల్లడించారు.

Authored byAndaluri Veni | Samayam Telugu 16 Jul 2022, 8:11 pm
ఓ జవాన్ ముగ్గురు సహోద్యోగులపై కాల్పులు జరిపి... తనను తాను కాల్చుకున్నాడు. దాంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. జమ్మూకశ్మీర్‌లోని (Jammu and Kashmir) ఉదంపూర్ జిల్లాలోని క్యాంపులో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇండో-టిబెటన్ బోర్డర్ జవాన్ మధ్యాహ్నం 3.30 గంటల ప్రాంతంలో INSAS సర్వీస్ రైఫిల్‌తో తోటి ఉద్యోగులపై కాల్పులు జరిపాడు. అదే తుపాకీతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
Samayam Telugu ప్రతికాత్మక చిత్రం


చనిపోయిన జవాన్‌ని.. భూపేంద్ర సింగ్‌గా అధికారులు గుర్తించారు. ఈ ఘటనలో గాయపడిన మరో ఇద్దరు జవాన్లను ఆస్పత్రికి తరలించారు. అయితే వారికి ప్రాణాపాయం లేదని అధికారులు తెలిపారు. భూపేంద్ర సింగ్ ITBP ఎనిమిదో బెటాలియన్‌కు చెందిన వాడు. ప్రస్తుతం జమ్మూకశ్మీర్‌లో తాత్కాలిక బెటాలియన్‌లో డ్యూటీ చేస్తున్నాడు. అయితే జవాన్ ఎందుకు ఇలా చేశాడనేది ఇంకా తెలియరాలేదు. దీనిపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

కాగా శుక్రవారం కూడా ఇలాంటి సంఘటనే చోటుచేసుకుంది. జమ్మూకశ్మీర్‌లోని పూంచ్‌లోని సురన్ కోట్ ఆర్మీ క్యాంపులోఓ జవాన్ కాల్పులు జరపడంతో ఇద్దరు జవాన్లు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. 156 టెరిటోరియల్ ఆర్మీ బెటాలియన్‌లో జవాన్‌లు చనిపోయారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.