యాప్నగరం

అమ్మాయిల్లో మద్యం అలవాటుపై సీఎం వ్యాఖ్యలు

మద్యానికి అలవాటుపడే అమ్మాయిల సంఖ్య నానాటికీ పెరిగిపోవడం ఆందోళనకు గురిచేస్తోందని ఓ ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు.

TNN 10 Feb 2018, 9:59 am
మద్యం సేవించే అమ్మాయిల సంఖ్య క్రమంగా పెరగడంపై గోవా సీఎం మనోహర్ పారికర్ ఆందోళన వ్యక్తం చేశారు. మహిళల్లో ఆల్కహాల్‌ సేవించే అలవాటు తనకు ఎంతో భయాన్ని కలిగిస్తోందని పారికర్ వ్యాఖ్యానించారు. పనాజీ వేదికగా జరిగిన యువజన పార్లమెంట్‌లో పాల్గొని ప్రసంగించిన ఆయన.. గోవాలో మాదకద్రవ్యాల నియంత్రణకు తమ పోరాటం సాగుతుందని పేర్కొన్నారు. డ్రగ్ మాఫియాను అంతం చేయడానికి ఆపరేషన్ కొనసాగుతోందని, రాష్ట్రం నుంచి మాదక ద్రవ్యాలను పూర్తిగా తరిమికొడతామనే నమ్మకం తనకు ఉందని పునరుద్ఘాటించారు. కళాశాలల్లో డ్రగ్స్ సంస్కృతి ఎక్కువగా ఉందని తాను భావించడం లేదని, ఇప్పటి వరకు 170 మంది వ్యాపారులను పోలీసులు అరెస్ట్ చేశామని తెలిపారు. ప్రస్తుత చట్టాల ప్రకారం మాదక ద్రవ్యాలతో పట్టుబడిన వారు 15 రోజుల్లోనే బెయిల్‌పై బయటకు వస్తున్నారని, ఇలాంటి వారిని న్యాయస్థానాలు కూడా ఏమీ చేయలేకపోతున్నాయని అన్నారు.
Samayam Telugu ive begun to fear as even girls have started drinking beer manohar parrikar
అమ్మాయిల్లో మద్యం అలవాటుపై సీఎం వ్యాఖ్యలు


ఏదేమైనా డ్రగ్స్ వాడుతున్నవారు పట్టుబడుతన్నారని పారికర్ తెలియజేశారు. నిరుద్యోగంపై కూడా స్పందించిన మనోహర్ పారికర్.. గోవా యువత కష్టపడి పనిచేయడానికి ఇష్టపడటంలేదని అన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో క్లర్క్ పోస్టుల కోసం యువత క్యూ కడుతున్నారని, ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగాల్లో పెద్దగా కష్టపడాల్సిన అవసరం ఉండదనే భావనతో ఉన్నారని పారికర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ ఆలోచన నుంచి బయటపడాలని ఆయన సూచించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.