యాప్నగరం

పరువు నష్టం కేసులో కేజ్రీవాల్‌కు చుక్కెదురు

ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ కు చుక్కెదురైంది. ఢిల్లీ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్

TNN 25 Mar 2017, 5:44 pm
ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ కు చుక్కెదురైంది. ఢిల్లీ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ (డీడీసీఏ) వ్యహారంలో తన ప్రతిష్టకు భంగం కల్గించారంటూ కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ దాఖలు చేసిన పరువునష్టం కేసులో కేజ్రీవాల్ పటియాల కోర్టు నోటీసులు జారీ చేసింది.
Samayam Telugu jaitley defamation case kejriwal put on trial
పరువు నష్టం కేసులో కేజ్రీవాల్‌కు చుక్కెదురు

డీడీసీఏ అధ్యక్షుడిగా జైట్లీ కొనసాగిన సమయంలో అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారని కేజ్రీవాల్ గతంలో ఆరోపించారు. దీన్ని ఖండిస్తూ జైట్లీ కేజ్రీవాల్ సహా మరో ఐదుగురు ఆప్ నేతలపై రూ.10కోట్ల పరువు నష్టం చెల్లించాలని కేసు వేశారు.

ఈ కేసు నుంచి తమను మినహాయించాలని కేజ్రీవాల్ కోరారు. అయితే కోర్టు ఆ విజ్ఞాపనను తోసిపుచ్చింది.

పటియాలా చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ సుమిత్ దాస్...కేజ్రీవాల్, అశుతోష్, కుమార్ విశ్వాస్, సంజయ్ సింగ్, రాఘవ్ చద్దా, దీపక్ వాజ్ పేయ్ లకు నోటీసులు జారీ చేశారు.

వీరంతా మే 20న విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో ఆదేశాలు జారీ చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.