పెద్దనోట్ల రద్దు అంశంపై కాంగ్రెస్ చేసిన విమర్శలకు కేంద్ర ఆర్ధిక మంత్రి జైట్లీ ధీటుగా బదులిచ్చారు. కేంద్ర తీసుకున్ననిర్ణయంతో ఏదో నష్టం జరగబోతోందంటూ కాంగ్రెస్ పార్టీ దుష్ప్రచారం చేస్తోందని జైట్లీ దయ్యబట్టారు. ఢిల్లీలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ... కేంద్రం తీసుకున్న నిర్ణయం వల్ల సామాన్యులు, రైతులు ఇబ్బందులు పడుతున్నారని రాహుల్ గాంధీ చేస్తున్న విమర్శలు సరికావన్నారు... నల్లకుబేరులను అంతమందించేందుకు చేపట్టిన ఈ పెద్ద ఆపరేషనలో ఇలాంటి చిన్న చిన్న ఇబ్బందులు సహజమన్నారు. ప్రస్తుతం నెలకొన్న ఇబ్బందులు త్వరలోనే తొలిగిపోతాయన్నారు. నల్లకుబేరుల భరతం పట్టేందుకు చేసేందుకు తమ ప్రభుత్వం ఇలాంటి ప్రయోగం చేయాల్సి వచ్చిందన్నారు. రాహుల్ గాంధీ ఈ విషయంలో మనసుపెట్టి ఆలోచించాలని జైట్లీ సూచించారు.
బ్లాక్ మనీని నిరోధించడంలో విఫలమైన కాంగ్రెస్ పార్టీ ఆత్మవిమర్శ చేసుకోవాలని సూచించారు. కాంగ్రెస్ హయాంలో బ్లాక్ మనీని ఎందుకు నిరోధించలేకపోయిందో చెప్పాలని ఈ సందర్భంగా కేంద్ర ఆర్ధిక మంత్రి జైట్లీ డిమాండ్ చేశారు. మూడు సార్లు ఆర్ధిక మంత్రిగా పనిచేసిన చిందబరం లాంటి వారు కూడా పెద్దనోట్ల రద్దుపై విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. కేంద్రం తీసుకున్న చర్యలతో ఆదాయాన్ని బ్యాంకుల్లో జమా చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని.. ఫలితంగా వారి డబ్బుకు భద్రత కల్పించినట్లయిందని కేంద్ర ఆర్ధిక మంత్రి జైట్లీ పేర్కొన్నారు.
బ్లాక్ మనీని నిరోధించడంలో విఫలమైన కాంగ్రెస్ పార్టీ ఆత్మవిమర్శ చేసుకోవాలని సూచించారు. కాంగ్రెస్ హయాంలో బ్లాక్ మనీని ఎందుకు నిరోధించలేకపోయిందో చెప్పాలని ఈ సందర్భంగా కేంద్ర ఆర్ధిక మంత్రి జైట్లీ డిమాండ్ చేశారు. మూడు సార్లు ఆర్ధిక మంత్రిగా పనిచేసిన చిందబరం లాంటి వారు కూడా పెద్దనోట్ల రద్దుపై విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. కేంద్రం తీసుకున్న చర్యలతో ఆదాయాన్ని బ్యాంకుల్లో జమా చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని.. ఫలితంగా వారి డబ్బుకు భద్రత కల్పించినట్లయిందని కేంద్ర ఆర్ధిక మంత్రి జైట్లీ పేర్కొన్నారు.