జల్లికట్టుపై విధించిన నిషేదాన్ని తొలగించేందుకు తమిళనాడు ప్రభుత్వం, కేంద్రప్రభుత్వాలు తమవంతుగా ప్రయత్నిస్తున్నా...తమిళతంబీలు వెనక్కి తగ్గడం లేదు. నిషేదం ఎత్తివేస్తే గానీ ఆందోళన విరమించబోమని బీష్మించుకు కూర్చున్నారు. జల్లికట్టు ఆటకు అనుమతి ఇవ్వాలని చెన్నైలోని మెరీనా బీచ్ లో చేపట్టిన ఆందోళన శనివారంతో ఐదోరోజుకు చేరింది.
జల్లికట్టు నిర్వహించుకునేలా ప్రత్యేక ఆర్డినెన్స్ ను అమలు చేసేందుకు తమిళనాడు డ్రాఫ్ట్ ను రాష్ట్రపతికి పంపింది.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైతం జల్లికట్టుపై తమిళ ప్రజలు చేస్తున్న ఆందోళనను అర్థం చేసుకున్నారు. తమిళన సంస్కృతి, సంప్రదాయాలు గొప్పవని, వాటిని గౌరవిస్తామని ఆయన స్పష్టం చేశారు.
జల్లికట్టు కోసం సాగుతున్న పోరాటంలో తమిళనాడు రాజకీయపార్టీలు ఎవరికివారు ప్రజల మద్దతును కూడగట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ విషయంలో అధికార అన్నాడీఎంకే యాక్టీవ్ జల్లికట్టుపై ఆర్డినెన్స్ కోసం ప్రయత్నాలు ప్రారంభించింది. దీంతో ప్రతిపక్ష డీఎంకే సైతం ప్రత్యక్ష ఆందోళనలు నిర్వహిస్తోంది. శనివారం పార్టీ ప్రజాప్రతినిధులతో వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ ఆధ్వర్యంలో నేతలు మౌన దీక్ష చేపట్టారు.
మెరీనా బీచ్ లో ఐదురోజులుగా ఆందోళన చేస్తున్న ప్రజలకు సినీ ఇండస్ట్రీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. స్వచ్ఛంద సంస్థలు, పార్టీలు, పలువురు నేతలు ఆహారం, మంచినీళ్లు అందజేస్తున్నారు.
జల్లికట్టు నిర్వహించుకునేలా ప్రత్యేక ఆర్డినెన్స్ ను అమలు చేసేందుకు తమిళనాడు డ్రాఫ్ట్ ను రాష్ట్రపతికి పంపింది.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైతం జల్లికట్టుపై తమిళ ప్రజలు చేస్తున్న ఆందోళనను అర్థం చేసుకున్నారు. తమిళన సంస్కృతి, సంప్రదాయాలు గొప్పవని, వాటిని గౌరవిస్తామని ఆయన స్పష్టం చేశారు.
జల్లికట్టు కోసం సాగుతున్న పోరాటంలో తమిళనాడు రాజకీయపార్టీలు ఎవరికివారు ప్రజల మద్దతును కూడగట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ విషయంలో అధికార అన్నాడీఎంకే యాక్టీవ్ జల్లికట్టుపై ఆర్డినెన్స్ కోసం ప్రయత్నాలు ప్రారంభించింది. దీంతో ప్రతిపక్ష డీఎంకే సైతం ప్రత్యక్ష ఆందోళనలు నిర్వహిస్తోంది. శనివారం పార్టీ ప్రజాప్రతినిధులతో వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ ఆధ్వర్యంలో నేతలు మౌన దీక్ష చేపట్టారు.
మెరీనా బీచ్ లో ఐదురోజులుగా ఆందోళన చేస్తున్న ప్రజలకు సినీ ఇండస్ట్రీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. స్వచ్ఛంద సంస్థలు, పార్టీలు, పలువురు నేతలు ఆహారం, మంచినీళ్లు అందజేస్తున్నారు.