తమిళుల సంప్రదాయ క్రీడ జల్లికట్టుపై నిషేధానికి వ్యతిరేకంగా ప్రముఖ తమిళ నటులు రజినీకాంత్, కమల్ హాసన్, అజిత్, సూర్య, ధనుష్ తదితరులు చెన్నైలో మౌన పోరాటానికి దిగారు. సౌత్ ఇండియన్ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (నడిగర్ సంఘం) ఆధ్వర్యంలో టి నగర్లోని ప్రధాన కార్యాలయంలో మౌన దీక్షకు దిగారు.
నడిగర్ సంఘం అధ్యక్షుడు నాజర్ ఈ మౌన దీక్షకు నాయకత్వం వహించారు. ఈ కార్యక్రమంలో నడిగర్ సంఘం జనరల్ సెక్రటరీ విశాల్, కోశాధికారి కార్తి, ఉపాధ్యక్షుడు పొన్వన్నన్ పాల్గొన్నారు. జల్లికట్టుకు మద్దతుగా తమిళ సినీ యూనియన్లు, టెక్నీషియన్లు, డైరెక్టర్లు, నిర్మాతల సంఘాలు ఆందోళనకు దిగడంతో రాష్ట్ర వ్యాప్తంగా సినిమా థియేటర్లు కూడా మూతబడ్డాయి.
నడిగర్ సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన మౌన దీక్షలో శివకుమార్, భాగ్యరాజ్, సత్యరాజ్, ప్రతిభన్, ప్రభు, మన్సూర్ అలీ ఖాన్, శివ కార్తికేయన్, సంతానం, రమేశ్ ఖన్నా, ఆనందరాజ్, మనోబాలా, త్రిష, శాలిని, కోవై సరళ, పూచి మురుగన్ తదితరులు పాల్గొని జల్లికట్టుకు తమ మద్దుతు తెలియజేసారు.
మరోవైపు నడిగర్ సంఘం ప్రధాన కార్యలయంలోకి మీడియా ప్రవేశించకుండా గేట్లను మూసివేశారు. విద్యార్థుల చేస్తున్న ఆందోళనపై మీడియా దృష్టిని కేంద్రీకరించడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు నడిగర్ సంఘం వెల్లడించింది. ఒకవేళ మీడియాను వడిగర్ సంఘం మౌన దీక్ష శిబిరానికి అనుమతిస్తే బయట జరుగుతున్న ఆందోళనలు ప్రంపచానికి తెలియవని సంఘం అధ్యక్షుడు నాజర్ తెలిపారు. తమిళ నటులు ఎవరూ ఎలాంటి ప్రకటనలు చేయరని, అందరూ మౌన దీక్షలో మాత్రమే పాల్గొంటారని ఆయన స్పష్టం చేసారు. రియల్ హీరోలైన యువత చేస్తున్న ఆందోళన వెనుక తాము నిలుచుంటామని తేల్చి చెప్పారు.
నడిగర్ సంఘం అధ్యక్షుడు నాజర్ ఈ మౌన దీక్షకు నాయకత్వం వహించారు. ఈ కార్యక్రమంలో నడిగర్ సంఘం జనరల్ సెక్రటరీ విశాల్, కోశాధికారి కార్తి, ఉపాధ్యక్షుడు పొన్వన్నన్ పాల్గొన్నారు. జల్లికట్టుకు మద్దతుగా తమిళ సినీ యూనియన్లు, టెక్నీషియన్లు, డైరెక్టర్లు, నిర్మాతల సంఘాలు ఆందోళనకు దిగడంతో రాష్ట్ర వ్యాప్తంగా సినిమా థియేటర్లు కూడా మూతబడ్డాయి.
నడిగర్ సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన మౌన దీక్షలో శివకుమార్, భాగ్యరాజ్, సత్యరాజ్, ప్రతిభన్, ప్రభు, మన్సూర్ అలీ ఖాన్, శివ కార్తికేయన్, సంతానం, రమేశ్ ఖన్నా, ఆనందరాజ్, మనోబాలా, త్రిష, శాలిని, కోవై సరళ, పూచి మురుగన్ తదితరులు పాల్గొని జల్లికట్టుకు తమ మద్దుతు తెలియజేసారు.
మరోవైపు నడిగర్ సంఘం ప్రధాన కార్యలయంలోకి మీడియా ప్రవేశించకుండా గేట్లను మూసివేశారు. విద్యార్థుల చేస్తున్న ఆందోళనపై మీడియా దృష్టిని కేంద్రీకరించడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు నడిగర్ సంఘం వెల్లడించింది. ఒకవేళ మీడియాను వడిగర్ సంఘం మౌన దీక్ష శిబిరానికి అనుమతిస్తే బయట జరుగుతున్న ఆందోళనలు ప్రంపచానికి తెలియవని సంఘం అధ్యక్షుడు నాజర్ తెలిపారు. తమిళ నటులు ఎవరూ ఎలాంటి ప్రకటనలు చేయరని, అందరూ మౌన దీక్షలో మాత్రమే పాల్గొంటారని ఆయన స్పష్టం చేసారు. రియల్ హీరోలైన యువత చేస్తున్న ఆందోళన వెనుక తాము నిలుచుంటామని తేల్చి చెప్పారు.