యాప్నగరం

కరోనా విలయం: మూడు రోజులకే జామా మసీదు మూసివేత

Delhi Coronavirus: కేంద్రం ఇచ్చిన సడలింపులతో గేట్లు తెరిచిన 3 రోజులకే జామా మసీద్ మళ్లీ మూతబడింది. దేశ రాజధాని ఢిల్లీలో కరోనా వైరస్ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. మసీదులన్నీ మూసివేయాలని మతపెద్ద కోరారు.

Samayam Telugu 11 Jun 2020, 11:25 pm
చారిత్రక జామా మసీదు మళ్లీ మూతబడింది. ఢిల్లీలో కరోనా కేసులు డేంజర్ బెల్స్ మోగిస్తున్న నేపథ్యంలో జామా మసీదును జూన్‌ 30 వరకు మూసివేస్తున్నట్టు మసీదు షహీ ఇమాం సయ్యద్‌ అహ్మద్‌ బుఖారి గురువారం (జూన్ 11) ప్రకటించారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్ నిబంధనలు సడలించి ఆలయాలు, ప్రార్థన మందిరాల్లో ప్రవేశాలకు ప్రజలకు అనుమతి ఇవ్వడంతో సోమవారం (జూన్ 8) జామా మసీదు గేట్లు తెరుచుకున్నాయి. మసీదును తెరిచిన 3 రోజులకే మూసివేస్తున్నట్లు ప్రకటంచడం వెనుక బలమైన కారణమే ఉంది.
Samayam Telugu ఢిల్లీ జామా మసీదు
Jama Masjid


షహీ ఇమాం బుఖారి కార్యదర్శి అమానుల్లా కొవిడ్-19కు చికిత్స పొందుదూ ఢిల్లీలోని సప్తార్‌ జంగ్‌ ఆస్పత్రిలో రెండు రోజుల కిందట మరణించారు. ఈ నేపథ్యంలో ఆయన మసీదు మూసివేత నిర్ణయం ప్రకటించారు. అమానుల్లా జూన్‌ 3న కరోనా లక్షణాలతో ఆస్పత్రిలో చేరాడు. ఆరోగ్యం విషమించడంతో ఆరు రోజుల్లోనే మృతి చెందారు.

దేశంలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్న వేళ.. మసీదులను కొంత కాలం పాటు మూసివేయాడమే శ్రేయస్కరమని సయ్యద్ అహ్మద్ బుఖారీ పేర్కొన్నారు. ప్రజలు ఇంటి వద్దే నమాజ్‌ చేసుకోవాలని సూచించారు. ఇతర మసీదులు కూడా ఈ దిశగా నిర్ణయం తీసుకోవాలని ఆయన కోరారు.

Also Read: మహారాష్ట్రలో కరోనా మృత్యుకేళి.. ఒక్కరోజే 149 మరణాలు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.