యాప్నగరం

వైద్యుడా వందనం.. చప్పట్లతో మార్మోగిన దేశం

Janata Curfew: ప్రధాని మోదీ పిలుపు మేరకు మార్చి 22 సాయంత్రం 5 గంలకు దేశం చప్పట్లతో మార్మోగింది. కరోనా వైరస్‌తో పోరాడుతున్న వైద్య సిబ్బందికి సంఘీభావం ప్రకటించింది.

Samayam Telugu 23 Mar 2020, 4:18 pm
ప్రధాని మోదీ పిలుపును అందుకొని యావత్ దేశం వైద్య సిబ్బందికి చప్పట్లతో కృత‌జ్ఞత ప్రకటించింది. ఆదివారం (మార్చి 22) సరిగ్గా 5 గంటలకు దేశం చప్పట్లతో మార్మోగిపోయింది. కరోనా వైరస్ కట్టడిలో భాగంగా ఆదివారం ఉదయం నుంచి ఇళ్లకే పరిమితమైన దేశవాసులు సరిగ్గా సాయంత్రం 5 గంటలకు గుమ్మాల ముందుకు వచ్చి చప్పట్లు కొట్టారు. కరోనా వైరస్ నియంత్రణకు ఎనలేని సేవ చేస్తున్న వైద్యులు, నర్సులు, శానిటేషన్ సిబ్బందికి అభినందనలు ప్రకటించారు. ఆవిధంగా జాతి యావత్తు ఐక్యతను ప్రదర్శించింది.
Samayam Telugu clapp


ప్రగతి భవన్‌ గుమ్మం ముందుకు వచ్చి తెలంగాణ సీఎం కేసీఆర్ తన కుటుంబ సభ్యులతో కలిసి చప్పట్లు కొట్టారు. ఏపీ ముఖ్యమంత్రి కేసీఆర్ తన నివాసంలో బయటకు వచ్చి అధికారులతో కలిసి చప్పట్లు కొట్టారు. యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గంట బజాయించి తన సంఘీభావం ప్రకటించారు. తన పిలుపునకు అద్భుతంగా స్పందించిన దేశవాసులందరికీ ప్రధాని మోదీ ధన్యవాదాలు తెలిపారు.

దేశవ్యాప్తంగా పౌరులందరూ బాల్కనీలలోకి వచ్చి చప్పట్లు కొట్టారు. గంటా బజాయించి తమ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు దేశంపై గౌరవభావంతో భావోద్వేగానికి గురయ్యారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో నటుడు రాజేంద్రప్రసాద్.. డాక్టర్లకు చప్పట్లతో సంఘీభావం ప్రకటిస్తూ ఒకింత భావోద్వేగానికి గురయ్యారు. దేశమంతా ఒక్కతాటిపై ఉందని చూపించామని పేర్కొన్నారు.


Also Read: దేశ ప్రధాని పైనే సెటైర్లా.. వెంటనే అరెస్టు చేయండి: కేసీఆర్

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.