యాప్నగరం

భారతీయ అలంకరణకు షింజో దంపతుల నీరాజనం

భారత పర్యటన నిమిత్తం విచ్చేసిన జపాన్ ప్రధాని షింజో అబే దంపతులు.. అందరి చూపునూ తమవైపు తిప్పుకుంటున్నారు. భారతీయ సంప్రదాయ దుస్తుల్లో తళుక్కుమంటూ అలరిస్తున్నారు. బుధవారం (సెప్టెంబర్ 13) అహ్మదాబాద్‌లోని సబర్మతీ ఆశ్రమం సందర్శన సందర్భంగా.. జపాన్ ప్రధాని షింజో అబే..

TNN 13 Sep 2017, 8:59 pm
భారత పర్యటన నిమిత్తం విచ్చేసిన జపాన్ ప్రధాని షింజో అబే దంపతులు.. అందరి చూపునూ తమవైపు తిప్పుకుంటున్నారు. భారతీయ సంప్రదాయ దుస్తుల్లో తళుక్కుమంటూ అలరిస్తున్నారు. బుధవారం (సెప్టెంబర్ 13) అహ్మదాబాద్‌లోని సబర్మతీ ఆశ్రమం సందర్శన సందర్భంగా.. జపాన్ ప్రధాని షింజో అబే తెల్లని కుర్తా పైజామా ధరించి, దానిపై నీలి రంగు జాకెట్ వేసుకున్నారు. అచ్చూ.. విదేశీ పర్యటనల సందర్భంగా ప్రధాని మోదీ డ్రెస్సింగ్ స్టైల్లో షింజో దర్శనమిచ్చి ఆకట్టుకున్నారు. మరోవైపు షింజో సతీమణి అకీ అబే.. గులాబీ రంగు సల్వార్ కమీజ్‌లో తళుక్కుమన్నారు.
Samayam Telugu japanese pm shinzo abe wife celebrate indian fashion in ahmedabad
భారతీయ అలంకరణకు షింజో దంపతుల నీరాజనం


తమ పర్యటన నిమిత్తం షింజో అబే, అకీ అబే దంపతులు ఇక్కడ ఉండేది కేవలం 2 రోజులే అయినా.. ఇండియాలో గడిపినంత కాలం ఇక్కడి వస్త్రాలంకరణలోనే మెరుద్దామని ముందే గట్టి సంకల్పం చేసుకొని వచ్చినట్లు కనిపిస్తోంది.

ఈరకంగా వారిద్దరూ భారతీయ సంప్రదాయం, అలంకరణకు నీరాజనం చెబుతున్నారు. భారత్-జపాన్ మధ్య చిరకాలంగా కొనసాగుతున్న స్నేహ బంధానికి ఇది అసలైన గౌరవం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.