యాప్నగరం

జయ మరణం: కారణాలను వెల్లడించిన డాక్టర్ల బృందం

జయలలిత మరణం ఓ మిస్టరీగా మారిన సంగతి తెలిసిందే. చాలా కాలంపాటు అపోలో హాస్పిటల్లో చికిత్స పొందిన అమ్మ.. ఇక ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కావడమే తరువాయి..

TNN 6 Feb 2017, 3:10 pm
జయలలిత మరణం ఓ మిస్టరీగా మారిన సంగతి తెలిసిందే. చాలా కాలంపాటు అపోలో హాస్పిటల్లో చికిత్స పొందిన అమ్మ.. ఇక ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కావడమే తరువాయి అనుకున్న సమయంలో హఠాత్తుగా ప్రాణాలు విడిచారు. దీంతో ఆమె మరణం పలు అనుమానాలకు తావిచ్చింది. చికిత్స కూడా గోప్యంగా సాగడంతోపాటు ఆమెను కలిసేందుకు ఎవరికీ అనుమతి ఇవ్వకపోవడంతో అనుమానాలు మరింత బలపడ్డాయి. అయితే.. జయ మరణం విషయంలో నెలకొన్న అనుమానాలను నివృతి చేసేందుకు ఆమెకు చికిత్స చేసిన డాక్టర్ల బృందం సోమవారం మీడియా ముందుకొచ్చింది.
Samayam Telugu jaya doctor speaks about her death rumors
జయ మరణం: కారణాలను వెల్లడించిన డాక్టర్ల బృందం


ఇన్ఫెక్షన్ల కారణంగానే జయలలిత మరణించారని ఆమెకు చికిత్స అందించిన డాక్టర్లు తెలిపారు. తీవ్రమైన డయాబెటీస్ కారణంగా జయ ఆరోగ్యం విషయంలో ఇబ్బందులు తలెత్తాయని ఆమెకు చికిత్స అందించిన లండన్ వైద్యుడు రిచర్డ్ మీడియాకు తెలిపారు. ఇన్ఫెక్షన్ల కారణంగా ఆమె శరీర అవయవాల పనితీరు దెబ్బతిందని ఆయన తెలిపారు. ఆమె మరణాన్ని ఊహించలేదని, కోలుకుంటున్న దశలో అనూహ్యంగా చనిపోయారని ఆయన తెలిపారు. జయకు చికిత్స అందించడం గొప్ప గౌరవంగా భావిస్తున్నాని ఆయన చెప్పారు.

జయ తనకు నచ్చిన టీవీ షోల గురించి తనకు చెప్పారని, నేను నా ఫ్యామిలీ గురించి, పిల్లల గురించి జయతో మాట్లాడానని రిచర్డ్ మీడియాతో తెలిపారు. జయ ఆరోగ్య వివరాలను ప్రభుత్వానికి, శశికళకు ఎప్పటికప్పుడు తెలియజేశామని చెప్పారు. జయలలితకు అత్యుత్తమ చికిత్స అందించామన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.