యాప్నగరం

దీపావళి నాటికి జయలలిత డిశ్చార్జ్ !

తమిళనాడు సీఎం జయలలిత అనారోగ్యం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు.

TNN 25 Oct 2016, 10:13 am
తమినాడు సీఎం జయలలిత ఇప్పుడిప్పుడే అనారోగ్యం నుంచి కోలుకుంటున్నారు...ఆమెను త్వరలోనే డిశ్చార్జ్ చేస్తామని అపోలో ఆస్పత్రి యాజమాన్యం ప్రకటించింది. అయితే జయ డిశ్చార్జ్ ఎప్పుడనే విషయంపై స్పష్టత ఇవ్వలేదు...అయితే ఆదివారం రోజు ఆమెను డిశ్చార్జ్ చేస్తారని ఏఐఏడీఎంకే వర్గాల నుంచి సమాచారం అందింది. దీపావళి పండగను జయ తన అభిమానులతో కలిసి జరుపుకుంటారని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రస్తుతం ఆమె లండన్ వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు.
Samayam Telugu jaya health condition
దీపావళి నాటికి జయలలిత డిశ్చార్జ్ !


ఇదిలా ఉండగా జయలలిత త్వరగా కోలుకోవాలని ప్రధాని మోడీ, తమిళనాడు గవర్నర్ విద్యాసాగర్ రావు తదితర ప్రముఖులు ఆకాంక్షిస్తున్నారు..మరోవైపు జయ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కాబోతున్నారనే వార్తలు రావడంతో తమిళ తంబీలు సంబరాల్లో మునిగి తేలుతున్నారు. గత నెల 22న ఆమె అనారోగ్యం కారణంలో ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. ఆమె ఆస్పత్రిలో చేరి నేటికి సరిగ్గా 33 రోజులు. ఈ వ్యవధిలో ఆమె ఆరోగ్య పరిస్థితిపై పలురకాల పూకార్లు షికార్లు చేశాయి...అయితే జయలలిత కోలుకుంటున్నారని...కొద్దిరోజుల్లో డిశ్చార్జ్ చేస్తారనే విషయం తెలియగానే అభిమానులు ఊపిరి పీల్చుకుంటున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.